సాహూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది.  కొద్దిసేపటి క్రితమే ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యింది.  దీని కోసం భారీ ఎత్తున అభిమానులు కదిలి వస్తున్నారు.  దాదాపు లక్షమంది వరకు ఈ ఈవెంట్ ను చూసేందుకు వస్తున్నారు.  ఈ ఈవెంట్ లో అనేక స్పెషల్ ఎట్రాక్షన్స్ ఉన్నాయి.  అందులో ఒకటి సాహో లో వాడిన కార్లు, ఇతర వస్తువులను ఇందులో వినియోగించారు.  


ఇదిలా ఉంటె, ఈ సినిమా ఆగష్టు 30 వ తేదీన ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్నది.  ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతున్నది.  ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  మాములుగా ఇండియాలో కంటే ముందుగా అమెరికా తదితర ప్రాంతాల్లో సినిమా రిలీజ్ అవుతుంది.  అయితే, ఈసారి అమెరికాలో కంటే ఇండియాలోనే ఈ సినిమాను మొదట రిలీజ్ చేయబోతున్నారు.  


తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు 29 వ తేదీ సాయంత్రం ప్రీమియర్ షోలుగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  దీనికోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసినట్టు తెలుస్తోంది.  ప్రీమియర్ షో టికెట్స్ కూడా మాములు వాటికంటే ఎక్కువగా ఉండబోతున్నాయి.  దాదాపు 500 రూపాయలకు పైగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  


తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇస్తే.. బాహుబలి 2 తరువాత ఇలా ప్రీమియర్ షో ప్రదర్శించిన సినిమా సాహో అవుతుంది.  పర్మిషన్ తప్పకుండా వస్తుందని అంటున్నారు. దాదాపు 250 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాను నిర్మిస్తున్నారు.  ప్రభాస్ కు జంటగా శ్రద్దా కపూర్ నటిస్తోంది.  ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని యాక్షన్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  సినిమా ఎలా ఉంటోందో తెలియాలంటే మాత్రం ఆగష్టు 30 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: