అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటికే ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చాయి. ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ కాగా ఆర్య 2 సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత అల్లు అర్జున్ సుకుమార్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. 
 
నిజానికి సుకుమార్ ఈ కథ మహేశ్ బాబు కోసం తయారు చేసాడు. కానీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు రావటంతో ఈ కథ అల్లు అర్జున్ ను చేరింది. మొదట అల్లు అర్జున్ ఈ కథకు ఓకె చెప్పినప్పటికీ ఇప్పుడు వేరే కథతో చేద్దామని సుకుమార్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్య, ఆర్య2 లాంటి లవ్ స్టోరీ చేద్దామని అల్లు అర్జున్ అడిగాడని సుకుమార్ తన దగ్గర ఉన్న మరో కథను కూడా అల్లు అర్జున్ కు వినిపించాడని వార్తలు వస్తున్నాయి. 
 
సుకుమార్ చెప్పిన మరో కథ నచ్చటంతో ఆ కథతో చేద్దామని అల్లు అర్జున్ చెప్పినట్లు సమాచారం. సుకుమార్ లేదా అల్లు అర్జున్ స్పందిస్తే తప్ప ఈ వార్తలో ఎంత నిజం ఉందనే విషయం చెప్పలేము. రంగస్థలంలాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్న ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 
 
అల్లు అర్జున్ ప్రస్తుతం అల... వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: