టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కథానాయికగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్, నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అదరహో అనే రేంజ్ లో జరిగింది. అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి, దిల్ రాజు, వివి వినాయక్ వంటివారు ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ వేడుకలో వివిధ ప్రాంతాలనుండి వేలాదిగా ప్రభాస్ ఫ్యాన్స్ హాజరయి, ఈ వేడుకను మరింత సక్సెస్ చేసారు. ఇకపోతే ఈ ఫంక్షన్ కి వచ్చిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ రిలీజ్ చేసిన, సాహో లోని ఒక స్పెషల్ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. 

అంతేకాక టోటల్ వేడుక మొత్తంలో హైలైట్ అయిన 'బ్యాడ్ బాయ్' అనే పల్లవితో సాగే ఆ సాంగ్ లో, ప్రభాస్ మోడరన్ అవుట్ ఫిట్స్ తో, అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎంతో ట్రెండీగా కనపడగా, ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ తో కలిసి ఈ ప్రత్యేక గీతంలో ఆడిపాడడం జరిగింది. విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ కు అందరినుండి విపరీతమైన అప్లాజ్ రావడం జరిగింది. ఇక నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రభాస్ పై ఎంతో ఇష్టంతో ఈ సినిమాకు ఇంత భారీ రేంజ్ లో ఖర్చు పెట్టడం జరిగిందని, అయితే అది రేపు సినిమా రిలీజ్ తరువాత మనకు స్క్రీన్ పై కనపడుతుందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఇక ప్రభాస్ పెదనాన్న, కృష్ణంరాజు గారు మాట్లాడుతూ, 

బాహుబలితో జాతీయ హీరోగా ఎదిగిన ప్రభాస్, రేవు సాహో రిలీజ్ తరువాత అంతర్జాతీయ హీరోగా మారడం ఖాయమని, అంత అత్యద్భుతంగా ఈ సాహో సినిమా రూపొందించబడిందని ఆయన చెప్పారు. ఇక ఈ వేడుకకు వచ్చిన పలువురు అతిథులు సైతం, సాహో ట్రైలర్ చూసిన తరువాత ఎంతో ఆశ్చర్యపోయామని, తప్పకుండా ఇంత అత్యద్భుతంగా తీసిన సినిమా, ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. మరి ఎన్నో అంచనాల మధ్య ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూద్దాం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: