మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్రోద్యమ వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న సైరా సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు మేకింగ్ వీడియోలు, ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో ప్రేక్షకుల మదిని దోచాయి. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. ఈ మేరకు మొన్న రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు, టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు కూడా ఆ తరువాత ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 

ఇకపోతే రేపు రిలీజ్ కానున్న ఈ టీజర్ లోని ప్రత్యేకతలు ఇవేనంటూ నేడు పలు మీడియా మాధ్యమాల్లో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం, ముందుగా టీజర్ లో నరసింహారెడ్డి పాత్రను చూపిస్తారని, ఆ పాత్ర చూపే సమయంలో నరసింహరెడ్డి గొప్పతనం, జీవిత గమనం గురించిన విషయాలను పవన్ కళ్యాణ్, తెర వెనుక నుండి వాయిస్ ఓవర్ రూపంలో అందిస్తారట. అలానే హీరోయిన్ నయనతార, ఇక సినిమాలో ముఖ్య పాత్ర అయిన నరసింహరెడ్డి గురువు పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, వంటి వారి పాత్రలను కూడా కొద్దిక్షణాలు చూపిస్తారట. ఇక సినిమాలోని కొన్ని ముఖ్య ఘట్టాలకు సంబంధించి వేసిన సెట్స్, పోరాటాలు, గుర్రపువు స్వారీలు వంటివి టీజర్ లో అత్యద్భుతంగా ఉండడమే కాకుండా, 

అలరించే బ్యాక్  గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ టీజర్ లో ఒక హైలైట్ అని అంటున్నారు. ఇకపోతే అన్నిటికంటే మరీ ముఖ్యంగా, టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి పలికే డైలాగ్స్ అదరహో అనే రేంజ్ లో ఉంటాయట. ఇక మొత్తగా చూసుకుంటే, రేపు సైరా టీజర్ రిలీజ్ తరువాత, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరగడం ఖాయమని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లు నిజంగానే టీజర్ ఇన్నిరకాల హైలైట్స్ తో అదరగొడితే, మెగా ఫ్యాన్స్ కు కన్నులపండుగే అని చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: