అడవి శేష్.. వెంకట్ రామ్‌జీ.. ఎవరు సక్సస్ వెనుక ఉన్న కీలక పాత్ర ధారులు.. అయితే వీరిద్దరూ అమెరికాలో చదువుకుని వచ్చినవారే.. అందుకే వీరికి మాస్ పల్స్ తెలియదన్న విమర్శ ఉండేదట. ఎవరు నిర్మాత పీవీపీ కూడా అదే అనేవారట. కానీ ఎవరు సినిమాతో ఆ అపోహ కాస్త పోయిందట. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు వెంకట్ రామ్ జీ చెబుతున్నారు.


అడ‌వి శేష్ హీరోగా రెజీనా క‌సాండ్రా హీరోయిన్‌గా న‌టించిన ఎవరు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకు ఈ సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. తమ సంతోషాన్ని మీడియాతో పంచుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే హిట్ అవుతుందనుకున్నారట.. కానీ.. ‘ఏ’ సెంటర్స్ లో మాత్రమే హిట్ అవుతుంది అనుకున్నారట.


కానీ, మాస్ సెంటర్స్ లో వస్తోన్న ఆదరణ చూస్తుంటే.. నిజంగా షాక్ గా అనిపించిందట. ఓవరాల్ గా ‘ఎవరు’ సక్సెస్ బాగా సంతృప్తిని ఇచ్చిందట. ఈ సినిమా వారి అంచనాలను మించి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుందట. సింగిల్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నందుకు హ్యాపీగా ఉందంటున్నాడు డైరెక్టర్ రామ్‌జీ.


సినిమాలో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లో వెంకట్ రామ్ జీ ఇదేఫార్ములా ఫాలో అయ్యాడట. ది ఇన్విజబుల్ గెస్ట్` పాయింట్‌ని పీవీపీగారు చెప్పగానే కనెక్ట్ అయ్యాడట. సినిమాను థ్రిల్లర్‌లా కాకుండా రివేంజ్ స్టోరీలా చూశాడట.


శేష్ ని అందరూ రైటర్ అని అంటుంటారు గాని, తను స్క్రిప్ట్ లో ఎక్కువుగా ఇన్ వాల్వ్ అయ్యేదాని కంటే.. స్క్రిప్ట్ ఎలా ఉంది ? స్క్రిప్ట్ లో ఐడియాలు ఏం బాగున్నాయి అని మాత్రామే చెప్పగలడంటున్నాడు రామ్ జీ. తను పేపర్ మీద రాసే రైటర్ కాదు.. కానీ తను ఇచ్చే కొన్ని సలహాలు బాగుంటాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: