సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ లు మంచి స్నేహితులు. ఈ ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో కలిసి ఎన్నో సినిమాలు చేశారు. రజినీకాంత్ కు కెరీర్ స్టార్టింగ్ లో తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చాయి. చాలా సినిమాలు చేశారు. అయితే, తమిళంలో హీరోగా పేరు రావడంతో అక్కడే స్థిరపడిపోయారు. తమిళంలో సినిమాలు చేస్తున్నా, తెలుగులో కూడా ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడ స్టార్ హీరోలతో సమానంగా ఆయనకు పేరు ఉన్నది.
ఇదిలా ఉంటె, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 151 వ సినిమా సైరా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సూపర్ హిట్టైంది. ఆగస్టు 20 వ తేదీన టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ లో పవన్ వాయిస్ ఓవర్ ఉన్నది. సినిమాలో పవన్ వాయిస్ విని చాలాకాలం అయ్యింది. అందుకే పవన్ వాయిస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సైరా సినిమా పాన్ ఇండియా మూవీ. దక్షిణాది భాషల్లో రిలీజ్ కాబోతున్నది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమా రిలీజ్ అవుతున్నది. తెలుగులో పవన కళ్యాణ్ వాయిస్ ఉన్నట్టుగానే తమిళంలో, కన్నడంలో, మలయాళంలో కూడా అక్కడి హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. అక్కడి స్టార్ హీరోలు సైరా టీజర్ కు వాయిస్ ఓవర్ చెప్పారట.
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. అలానే కన్నడంలో యాష్, మలయాళంలో మోహన్ లాల్ వాయిస్ ఓవర్ చెప్పారని ప్రచారం జరుగుతున్నది. ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఒకవేళ ఆయా స్టార్స్ ఆయా భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటె, సినిమాకు అది తప్పకుండా ప్లస్ అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.
ఈ చారిత్రాత్మక సినిమాలో అమితాబ్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. గాంధీ జయంతి రోజున ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐదు దేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.