బిగ్ బాస్ లో అందరూ ఊహించినట్టుగా రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజి పై నుండి ఒక్కో కంటెస్టెంట్ కి మార్క్ లు వేస్తూ వాళ్ళెలాంటి వాళ్ళో తెలియజేసింది. అయితే ఆమె మార్కులిచ్చిన విధానం అందరినీ ఆకర్షించింది. అయితే ఈ ప్రాసెస్ లో ఆ ఇద్దరి బండారం బయటపెట్టింది. ముఖ్యంగా శ్రీముఖి గురించి మాట్లాడుతూ, శ్రీముఖి బయట తనకి తెలుసని, బయట ఎంత అల్లరి చేసే వాళ్లమో, ఇక్కడ అలా లేదని, గేమ్ లో స్ట్రాటజీ ప్లే చేస్తుందని అంది.


బయట తనతో ఉన్నట్టు గేమ్ లో లేదని ఇక్కడ తను వేరేలా ప్రవర్తిస్తుందని, నేను చూసిని శ్రీముఖి వేరు, ఇక్కడ ఉన్న శ్రీముఖి వేరని తేల్చి పారేసింది. అందుకే తక్కువ మార్కులు వేసానని చెప్పింది.  హిమజ గురించి చెప్తూ ఆమె అందరితో కలవట్లేదని, దూరం దూరంగా ఉంటుందని మరి ఆమె ఎందుకు అలా చేస్తుందో తెలియదని, ఆ ఒక్క విషయం మార్చుకుంటే బాగుంటుందని చెప్పింది. అయితే వీరిద్దరి విషయాలను ఖరాఖండిగా చెప్పిన రోహిణి, మహేష్ విషయంలో తప్పు చేసినట్టుగా కనబడింది.


ఎందుకంటే మహేష్ ఏ గొడవలకైనా సై అంటే సై అంటాడని, అలా చేయకు అని చెప్పింది. ఇక్కడో విషయం గమనిస్తే ఆలీ గురించి చెప్తూ ప్రతీ దానిలో తాను ముందుంటాడని, ఏ గొడవలకైనా సిద్ధంగా ఉంటాడని అందుకే తనకి బాగా నచ్చాడని చెప్పిన రోహిణి మహేష్ విషయంలో ఇలా ఎందుకు చెప్పిందో అర్థం కావట్లేదు. ఒకరు గొడవలు పెట్టుకుంటే బాగున్నప్పుడు, మరొకరు గొడవలు పెట్టుకోవడం నచ్చకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది కాంట్రడిక్టరీ పాయింట్ లా కనబడుతుంది. దీంతో రోహిణి ఈ విషయంలో తప్పు చేసిందని క్లియర్ గా అర్థమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: