అయితే తాజాగా ఈ విషయం ఫై కాజల్ స్పందిస్తూ.. క్వీన్ సినిమా ను చెడగొట్టకుండా ఎంతో జాగ్రత్తతో ఈ సినిమా తీశాం. అయితే సెన్సార్ బోర్డు అన్ని కట్స్ చెప్పేసరికి నాకు ఆశ్ఛర్యం వేసింది. ఆ సన్నివేశాలతో వారికీ అభ్యంతరం ఏంటో నాకు అర్ధం కావడంలేదు. మేము ఎవరిని కించ పరచలేదు. మన నిజజీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఆ సీన్లను తెరకెక్కించాం. ఈవిషయం లో నిర్మాతలు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే తొలిగించిన సీన్లను మళ్ళీ సినిమాలో ఉండేలా సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలని కోరింది. అయితే మిగతా మూడు భాషల్లో సెన్సార్ బోర్డు ఇన్ని కట్స్ చెప్పలేదని ఈ సందర్భంగా కాజల్ తెలియజేసింది.
ఇక క్వీన్ ను తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మీ' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో తమన్నాప్రధాన పాత్రలో నటించగా 'అవె' ఫెమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. అలాగే కన్నడలో 'బట్టర్ ఫ్లై' అనే టైటిల్ తో రీమేక్ చేయగా పరుల్ యాదవ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. రమేష్ అరవింద్ తెరకెక్కించారు. ఇక మళయాలంలో 'జాం జాం' అనే టైటిల్ తో రీమేక్ చేయగా మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. నీలకంఠ రెడ్డి ఈ చిత్రాన్నితెరకెక్కించాడు.