టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా పేరుగాంచిన మూవీ సూపర్ స్టార్స్ లో ఒకరు అనే చెప్పాలి. బాహుబలి  రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తరువాత, విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాస్, ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోవడం జరిగింది. ఇకపోతే నిన్న ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 

అభిమానులు, సాహో సినిమా యూనిట్ తో పాటు, పలువురు సినిమా రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, తనకు ఆల్మోస్ట్ టాలీవుడ్లోని అందరు హీరోలతో మంచి పరిచయం ఉందని, అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ, ప్రభాస్ లో ఒక మంచి స్నేహితుడు కనపడతాడని దిల్ రాజు ఈ సందర్భంగా తెల్పడం జరిగింది. అలానే త్వరలో తాము కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్నామని కూడా చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా విషయమై నేడు ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, నిజానికి దిల్ రాజు గారు ఇప్పటికే ప్రభాస్ కోసం టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ దర్శకుడి చేత ఒక అద్భుతమైన కథ సిద్ధం చేయించడంతో పాటు, 

దానిని ప్రభాస్ కు కూడా వినిపించడం జరిగిందని, అయితే అది విని ఎంతో ఎక్సైట్ అయిన ప్రభాస్, ప్రస్తుతం తాను రాధాకృష్ణ దర్శకత్వంలో గోపికృష్ణ బ్యానర్ పై చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే మీ సినిమా మొదలెడదాం అని రాజు గారికి మాటిచ్చినట్లు ఆ వార్త యొక్క సారాంశం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో, ఇంతకీ ప్రభాస్ తో సినిమా చేయనున్న ఆ లక్కీ దర్శకుడు ఎవరో అనే విషయాలు మనకు తెలియాలంటే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై దిల్ రాజు గారు స్పందించాల్సిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: