సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల అయినా పోస్టర్స్ బట్టి చుస్తే మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపిస్తున్నారు అర్థం అవుతుంది. ఇందులో కథానాయికగా రష్మిక మందన్న  నటిస్తున్నారు.


ఈ సినిమా లో విజయశాంతి కి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇటీవలే  దర్శకుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే విజయశాంతి రీ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది.కానీ ఈ సినిమాలో విజయశాంతి ఏ పాత్ర పోషిస్తోంది క్లారిటీ ఇవ్వలేదు.  కానీ దీని గురించి సినీ వర్గాల్లో చాలా వార్తలు ప్రచారం అవుతున్నాయి.


సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ ప్రొఫెసర్ పాత్ర లో కనిపిస్తున్నారని సినిమా వర్గాల నుండి ప్రచారం జరుగుతుంది.కాని కొందరు మహేష్ బాబు కి  తల్లిగా నటిస్తుందని కూడా అంటున్నారు. అలాగే మరి కొందరు విజయశాంతి మహేష్ స్నేహితుడి తల్లి లాగా నటిస్తుందని అని కూడా అంటున్నారు. కానీ ఏది నిజమో ఏ పాత్రలో నటిస్తుంది చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా చెప్పు  వరకు వేచి చూడాల్సిందే.


చాలా రోజుల తర్వాత విజయశాంతి సినిమాలో నటి నటిస్తుండడంతో ఈ పాత్రలో నటిస్తుందని అభిమానుల్లో ఆత్రుత మొదలైంది. డైరెక్టర్ పోస్ట్ చేసిన విజయశాంతి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపైన చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి అప్పటి వరకు సినీ వర్గాలో ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపైన చిత్ర యూనిట్ దర్శకుడు ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: