సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ కథా చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేషు. 'క్షణం', 'గూఢచారి' తరువాత ఇటీవల విడులైన 'ఎవరు' చిత్రంతో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. శేషు ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
 
సినీ రంగంలో మొదటి నుంచి తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్‌, సమంత తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారన్నారు. ఆ సందర్భంగా ఆ ముగ్గురికి ధన్యవాదాలు తెలిపారు.
 
ప్రస్తుతం అడివి శేషు 'ఎవరు' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.ఇటీవలే సినిమా ప్రమోషన్స్‌ భాగంగా ఒక  యూట్యూబ్ ఛానల్ కి  ఇంటర్వ్యూ లో రాపిడ్ ఫైర్ రౌండ్ లో పేరు చెప్పుతే వారి గురించి ఒక పదం లో చెప్పాలి.
 
అప్పుడు ప్రభాస్ గారి గురించి అడగగా అడవి శేషు ఈ విధంగా వివరించాడు హీరో లో అందరికంటే మంచి మనసు వున్న వ్యక్తి ప్రభాస్ గారు అని శేషు చెప్పాడు.ప్రభాస్ గారి గురించి  మీకు ఎందుకు అలా అనిపించింది అడగగా బాహుబలి షూటింగ్ లో అంత పెద్ద స్టార్ అయినా నాతో చాలా చనువుగా ఉండేవాడు అని ఏమడిగినా చాలా వివరంగా విసుక్కోకుండా చెప్పేవాడు అని వివరించాడు.
 
పవన్ కళ్యాణ్ గారి గురించి అడగగా అతను ఇంటెలిజెంట్ అని అన్నాడు. రవితేజ గారి గురించి అడగగా అతను వెరీ ఫన్నీ పర్సన్ అని వివరించాడు. రానా గారి గురించి అడగగా అతను చాలా ఉత్సాహంగా వుండే వాడిని బాహుబలి షూటింగ్ లో అని అతని వలె బాహుబలి కి బాలీవుడ్ రేంజ్ లో మంచి పబ్లిసిటీ వచ్చింది అని ఘాజి వంట రానా మూవీ లు బాలీవుడ్ లో రానా కు మంచి పేరు వచ్చింది అని వివరించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: