ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  అప్పట్లో ఆయన నటించిన సినిమాలు వరుగా ఫెయిల్ కాండంతో ఇక రాజశేఖర్ కెరీర్ కంప్లీట్ అయ్యిందని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు.  అయితే ఆయన సతీమణి నటి జీవిత మాత్రం ఎప్పడూ న్యూస్ లో హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తున్నారు.  జీవిత కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇక రాజశేఖర్ - జీవిత దంపతుల కూతుళ్లు కూడా సినీరంగంలోకి ప్రవేశించారు.  ఇటీవల వారి చిన్న కూతురు శివాత్మకి ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది శివాత్మిక.  ఇక డాక్టర్ రాజశేఖర్ ‘గరుడవేగ’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ కావడమే కాదు బయ్యర్ల కడుపు నింపింది. మంచి లాభాలు తీసుకు రావడంతో రాజశేఖర్ కి మంచి క్రేజ్ పెరిగింది.

రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన రెండో సినిమా ‘కల్కి’ కూడా పరవాలేదు అనిపించుకుంది. తాజాగా మరో థ్రిల్లర్ కథకు రాజశేఖర్ ఒకే చెప్పారు. బేతాళుడు చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు.  క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

అయితే ఈ మూవీ స్టోరీ వినగానే రాజశేఖర్ ఎంతో ఎమోషన్ అయ్యారట..వెంటనే చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం.   నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: