టాలీవుడ్ ప్రెజెంట్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, ఇటీవల నటించిన నోటా మరియు డియర్ కామ్రేడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో, ఇకపై కెరీర్ లో తాను చేయబోయే సినిమాల విషయమై మరింత జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించారట. నిజానికి ఆయన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా, మంచి కథ, కథనలతో రూపొందినప్పటికీ, సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, అలానే సినిమా సాగతీతగా నెమ్మదిగా ఉండడం, మరీ ముఖ్యంగా లెంగ్త్ బాగా ఎక్కువ అవడం వంటి కొన్ని విమర్శలు వినిపించి, 

అవే చాలావరకు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపాయని అంటున్నారు సినిమా విశ్లేషకులు. అందుకే తాను త్వరలో చేయబోయే పూరి సినిమా విషయంలో స్టోరీ పక్కాగా విని, అలానే సినిమాకు సంబంధించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న తరువాతనే విజయ్ ఓకే చెప్పడం జరిగిందట. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ పంథాలో సాగనుందట. యూత్ ని ఆకట్టుకునే లవ్ మరియు రొమాన్స్ సన్నివేశాలతో పాటు, పూరి మార్క్ మాస్ యాక్షన్, డైలాగ్స్, ఫైట్స్ తో కలగలిపి, మొత్తంగా ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ కు పక్కాగా ఖుషి చేస్తుందని అంటున్నారు. 

ఇక పూరి చేసే సినిమాలు లెంగ్త్ పరంగా కూడా కొంత తక్కువ నిడివితోను ఉంటాయి, అదీకాక ఈ సినిమాను కూడా తక్కువ నిడివితోనే తెరకెక్కించాలని భావిస్తున్నారట. మరి ఇటీవల రామ్ తో తాను తీసిన ఇస్మార్ట్ శంకర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన పూరి, మన రౌడీ హీరోని ఎటువంటి క్యారెక్టర్ లో చూపిస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. పూరి కనెక్ట్స్ నిర్మాణ సారధ్యములో, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి, పూరి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మముగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: