ఈరోజు విడుదల కాబోతున్న ‘సైరా’ ట్రైలర్ గురించి మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి గతంలో రజనీకాంత్ నటించిన ‘2.0’ కు వచ్చిన సమస్యలు సైరా’ కు కూడ  వచ్చయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ వీఎఫ్ఎక్స్ ప‌నులు దాదాపు 26 స్డూడియోల‌లో జరుగుతున్నట్లు టాక్. దీనితో ఈ పనులు చేస్తున్న ఒక్క గ్రాఫిక్ కంపెనీ అన్న డేట్ కు తమ పనులు పూర్తి చేయలేక పోయినా దాని ప్రభావం ‘సైరా’ రిలీజ్ పై ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో ఆ డేట్ కు అన్ని పనులు పూర్తి అవుతాయా అన్న భయం చరణ్ చిరంజీవిలను వెంటాడుతున్నట్లు టాక్. దీనితో ఈ విషయమై పర్యవేక్షిస్తున్న టీమ్ నుండి ప్రతిరోజు చరణ్ సమాచారం సేకరిస్తూ ఈ విషయాలకు సంబంధించి ఇంకా ఎంత పెండింగ్ పని మిగిలి ఉంది అన్న విశ్లేషణలు చాల లోతుగా చేస్తున్నట్లు టాక్.   

ఈ లెక్కలు వేసే క్రమంలో చరణ్ ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసి వారి నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయంలో ఏ కంపెనీ అయినా ఆలస్యం చేస్తే ఆ కంపెనీకి చరణ్ హెచ్చరికలు కూడ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనుకున్న విధంగా ‘సైరా’ గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాకపోతే చిరంజీవి చరణ్ ల మైండ్ లో మరో ప్లాన్ ‘బి’ రెడీగా ఉన్నట్లు టాక్. అయితే ఆ ప్లాన్ బి విషయాలు ఎవరికీ చెప్పకుండా చరణ్ చిరంజీవిలు గోప్యంగా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: