నాగార్జున మాస్క్ లు తీసేయమని చెప్పినప్పటి నుండి హౌస్ మేట్స్ లో చాలా మార్పొచ్చింది. అయితే మాస్క్ లూ ధరించిన అందరికీ నాగార్జున అవార్డ్ లు ఇవ్వడం కూడా చూసాం. దాన్లో భాగంగా మహేష్ కి అందరి మధ్య పుల్లలు పెడుతున్నాడని అతనికి మ్యాచ్ బాక్స్ అవార్డు వచ్చింది. అయితే ఈ విషయాన్ని గమనించిన శ్రీముఖి మహేష్ పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయిందన్న భావనతో అతనితో ఉన్న స్నేహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది.


నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ పూర్తయ్యాక బాబా భాస్కర్ నామినేట్ అవడానికి కారణం మహేష్ అన్నట్టుగా మాట్లాడుతుంది. అదీగాక మహేష్, బాబా భాస్కర్ తో ఉంటూ, ఆయన మంచితనం వల్ల బతికేద్దామనుకుంటున్నాడు. అంతేకానీ సొంతంగా ఆడే తెలివి లేదని మాట్లాడింది. నిజం చెప్పాలంటే  అప్పటీ వరకు బాబా భాస్కర్, మహేష్, శ్రీముఖి, హిమజలు ఒక గ్రూపుగా ఉంటూ వచ్చారు.


అయితే ఎప్పుడైతే మహేష్ మీద నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చిందని తను అర్థం చేసుకున్నదో అప్పుడే తన గేమ్ ప్లాన్ ని మార్చేసింది. అతనితో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అని భావించి రివర్స్ లో అతని మీద దుష్ప్రచారం మొదలు పెట్టింది. అయితే నిజం చెప్పాలంటే మహేష్ మరీ అందరి మధ్యలో దూరిపోయి పుల్లలు పెట్టే రకం లాగా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. కాకపోతే వరుణ్, వితికాలంటే అతనికి మొదటినుండి పడదు.


వాళ్ళ విషయంలో తప్పితే అతను మరే విషయంలోనూ అలా ప్రవర్తించినట్టు కనబడదు.  కానీ శ్రీముఖి గేమ్ ని ముందే ఊహించేసుకుని అప్పుడే ప్లాన్ రెడీ చేసుకుని పెట్టుకుంది. ఆ ప్లాన్ ప్రకారమే ఆడుతుంది. మరి ఆమె ప్లాన్ ప్రకారం గేమ్ సాగుతుందా, మహేష్ శ్రీముఖి వ్యవహారాన్ని తెలుసుకుని, జాగ్రత్త పడతాడా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: