టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. భారతదేశ సినీ చరిత్రలోనే రికార్డులు తిరగరాసిన 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్తో అవి రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాబోయే చిత్రాల్లో ఎవరు చిత్రం తప్పించి మిగతావన్నీ కూడా నెగిటివ్ టాక్ నడుస్తుంది. రణరంగం, సాహో, గ్యాంగ్ లీడర్తో సహా కలిపి అన్నీ నెగిటివ్ టాక్ నడుస్తున్నాయి.
ఇకపోతే సాహో చిత్రం కొనొద్దని డిస్టిబ్యూటర్లందరూ అనుకున్నట్లు సమాచారం. ఎందువల్లనంటే హై బడ్జెట్ మూవీ కావడమే కాక ఈ చిత్రం మొదటి నుంచి కూడా రిపోర్ట్ కొంత తేడాగానే ఉండడంతో అందరూ ఆలోచనలో పడ్డారని సమాచారం. ఇకపోతే ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చిన్పటికీ. మొదట్లో సాహోకి బాలీవుడ్లో చాలా మంచి క్రేజ్ వచ్చింది బాలీవుడ్ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి ప్రమోషన్స్ కోసం కాస్త ఎక్కువ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఆ పరిస్థితి లేదు ఒక సౌత్ హీరోకి బాలీవుడ్లో ఎందుకు అంత ప్రమోషన్ అంత ప్రత్యేకత ఎందుకివ్వాలన్నట్లు ఉంది అక్కడి పరిస్థితి. ఇక సౌత్ విషయానికి వస్తే మన నేటివిటీ మిస్ అయినట్లు కొంత మంది భావిస్తున్నారు. సినిమా ట్రైలర్గాని, సాంగ్స్ కాని, మొత్తం ఫైట్లు అన్నీ హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి. ఇలా మిక్స్డ్టాక్తో ఉన్న సాహో ఇంత హైబడ్జెట్ చిత్రీకరణ ఉన్న ఈ చిత్రం ఇవన్నీ ప్లస్ అవుతాయి అనుకుంటే మైనస్ అయి కూర్చున్నాయి. ఇక చూడాలి మరి చివరికి ప్రభాస్ ఏం మాయ చేస్తాడో.