బాలీవుడ్‌ లో కాకుండా దక్షిణాదిలోనూ విలక్షణ నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు నీల్‌ నితిన్‌ ముఖేష్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘సాహో’ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారు. సుజీత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. జాకీ ష్రాఫ్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ, అరుణ్‌ విజయ, ప్రకాష్ బేలవాడి, చుంకి పాండే.  తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కూడా  ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతోంది అని మనందరికీ తెలిసిన విషయమే. సుజీత్‌ ఈ చిత్రం కథను తనకు చేపిన తర్వాత చాలా రోజుల వరకూ తనకు పిలువలేదని నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తాజాగా మీడియాతో అన్నారు. దీంతో సినిమా నుంచి తనను తపించారేమో అని అనుకున్న అని చెప్పారు. ‘ఓ అవార్డు ఫంక్షన్‌లో సుజీత్‌ను కలిశా కొన్ని రోజులు తర్వాత సుజిత్  కలిసి చిత్రం కథ వినిపించారని చెప్పారు. నాకు పాత్ర నచ్చింది. కానీ ఇది ‘బాహుబలి’ సినిమా (2015) విడుదల కాకముందు జరిగిన సంఘటన ఇది.

అప్పటికి బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతుండటంతో ప్రభాస్‌ కోసం మేమంతా రెండేళ్లు ఎదురుచూశాం. ఈ మధ్య సమయంలో నేను ఇతర సినిమాల్లో నటించా. ఆ సమయంలో సాహో టీం నుండి నాకు ఎలాంటి సమాధానం రాలేదు నేను సాహో సినిమాలో  ఓకే అయ్యాను లేదో  అని. ఆ సమయంలో ‘సాహో’ నుంచి నన్ను తప్పించారు ఏమో అని భయపడ్డా. కానీ సుజీత్‌ తన మాట నిలబెట్టుకున్నారు.

‘‘సాహో’తో పాటు అదే సమయంలో నేను నా సొంత నిర్మాణ సంస్థలో ‘బైపాస్‌ రోడ్‌’ అనే సినిమాలో నటిస్తున్నా. ఆ సినిమా కోసం నేను బరువు తగ్గాలి  కానీ ‘సాహో’లో నేను ఫిట్‌గా కనిపించాలి. ఈ నేపథ్యంలో కాస్త కష్టపడ్డా. ప్రభాస్ గారి గురించి అడగగా ఇలా వివరించాడు. ప్రభాస్‌ చాలా మృధుస్వభావి అని ఎంత పెద్ద స్టార్ అయినా అందరితో చాలా వినయంగా ఉంటాడని అని అనడు. అబుదబి షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నా భార్య రుక్మిణి గర్భవతిగా ఉందని ఆయనకు తెలిసింది. ప్రభాస్‌ ఆమెను కలిసినప్పుడు చాలా బహుమతులు ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం’  అని నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: