టాలీవడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగాభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది అనే చెప్పాలి. అలానే అత్యంత భారీ వ్యయంతో, ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మోలీవుడ్ వంటి సినిమా ఇండస్ట్రీల్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. 

ఇకపోతే ఇటీవల ఈ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసిన సైరా యూనిట్, కాసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఝాన్సీలక్ష్మి బాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి గొప్ప దేశభక్తులను మనం స్మరించుకుంటాం, అయితే వారందరికంటే ముందుగా తెల్ల దొరలపై తిరగబడ్డ రేనాటి వీరుడు నరసింహారెడ్డి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ టీజర్ లో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్, ఫైట్ సీన్స్, అలానే గ్రాఫిక్ వర్క్ వంటివి మనం చూడవచ్చు. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి అంటూ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్ నిజంగా అత్యద్భుతం అనే చెప్పాలి. ఇకపోతే ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఈ టీజర్ కు మరింత ప్రత్యేక ఆకర్షణ తీసుకువచ్చింది అనే చెప్పాలి. 

మొత్తంగా ఈ టీజర్ ప్రస్తుతం అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ సాధిస్తూ యూట్యూబ్ లో అదరగొడుతోంది. నరసింహా రెడ్డి గురువుగా గోసాయి వెంకన్నగా ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా, జులిస్ పకీయం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: