మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా సైరా నరసింహా రెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మెగాస్టార్ సరసన నయనతార జోడీకడుతున్న ఈ సినిమాలో తమన్నా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు జగపతి బాబు, రవికిషన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే మిలియన్ల్ కొద్దీ వ్యూస్ తో, లక్షలాది లైక్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ టీజర్ చూసిన వారందరూ, సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ ని నేడు ముంబైలో ఘనంగా నిర్వహించారు. హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఎక్సెల్ మూవీస్ సంస్థ అధినేతలు, మరియు బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన ఫర్హాన్ అక్తర్, సహా మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నిర్మాత రామ్ చరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళి బాలీవుడ్ లో తన సినిమా రిలీజ్ అవడం ఎంతో సంతోషంగా ఉందని, తప్పకుండా ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు చిరంజీవి. 

ఇకపోతే ఈ ఫంక్షన్ అనంతరం, ముంబైలో తాము బస చేసిన హోటల్ లోనే ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ సాహో మూవీ ప్రమోషన్స్ నిమిత్తం బస చేసిన ప్రభాస్ ని కలిసిన మెగాస్టార్ మరియు మెగా పవర్ స్టార్లు, కాసేపు ప్రభాస్ తో కలిసి ముచ్చటించి, ముచ్చటగా ముగ్గురూ కలిసి మీడియాకు ఒక మంచి ఫోజు ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఆ ఫోటో, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ లో అల్లువారి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, నరసింహారెడ్డిగా నటిస్తున్న తండ్రి మెగాస్టార్ తో కలిసి, త్వరలో సాహోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ తో కలిసి క్రేజీ గా ఫోటో దిగారన్నమాట....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: