సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన పోకిరి సినిమా, సూపర్ డూపర్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అతిపెద్ద విజయాన్ని అందుకుంది. అందులో మహేష్ బాబు తొలుత ఒక పోకిరీ వలె తిరుగుతూ, చివరకు క్లైమాక్స్ లో పోలీస్ అధికారి అని తేలే ట్విస్ట్, ఆ సినిమాకు ఆయువుపట్టు అని చెప్పాలి. అప్పట్లో కేవలం ఆ సన్నివేశం థియేటర్లలో వచ్చినప్పుడల్లా విపరీతమైన ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లేవి. 

అయితే అంతటి అద్భుతమైన హీరో క్యారెక్టర్ రివీలింగ్ ట్విస్ట్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాలేదు అనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకతవమలో రూపొందుతున్న సాహో సినిమాలో, హీరో క్యారెక్టర్ కు సంబంధించి ఒక కీలకమైన ట్విస్ట్ ఉంటుందని, అదే ఆ సినిమాకు అత్యంత బలమైన ట్విస్ట్ అని, అప్పటికే ఆడియన్స్ ని మంచి ట్విస్థులతో ముందుకు తీసుకెళ్లే సినిమా, అక్కడినుండి మరింత జోష్ తో ముందుకు సాగుతుందని నేడు కొన్ని మీడియా మాధ్యమాల్లో ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. తొలి సినిమా రన్ రాజా రన్ మాదిరిగా, ఈ సినిమాలో కూడా సుజీత్ కొన్ని మేజర్ ట్విస్టులు పెట్టడం జరిగిందని, 

అవి రేపు సినిమా చూసే ప్రేక్షకుడికి థ్రిల్ ని ఇవ్వడంతో పాటు, సినిమాపై ప్రేక్షకుడికి మరింతగా ఆసక్తిని పెంచుతాయని కూడా అంటున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ శ్రద్ధ, అలానే నటుడు మురళి శర్మ, విలన్స్ గా నటిస్తున్న నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్ ల క్యారెక్టర్స్ కూడా సూపర్బ్ గా డిజైన్ చేసాడని, తప్పకుండా తమ సినిమా, రేపు విడుదల తరువాత పెద్ద ఘన విజయం సాధించి తీరుతుందని సాహో టీమ్ ఎంతో నమ్మకంగా ఉందట. మరి నేడు విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఓపికపట్టాల్సిందే....!!    


మరింత సమాచారం తెలుసుకోండి: