సాహో సినిమా మీద లోకేష్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా వెబ్ సైట్ లో యూట్యూబ్ లో కొన్ని కొన్ని నెట్ వర్క్స్ లో తెలుగుదేశం పార్టీ సాహోకి వ్యతిరేకం ప్రభాస్ కి వ్యతిరేకం అన్నటువంటి ప్రచారం జరిగింది. కొంతమంది వాళ్ళ ట్వీట్ లు గానీ వాళ్ళ ప్రొజెక్షన్ తీరుకు, అంటే అందరూ పార్టీ తరపున కాదు, కొంతమంది స్వతంత్ర కార్యకర్తలు గాని ఎన్టీఆర్ అభిమానులు లేకపోతే, బాలకృష్ణ అభిమానులు ప్రభాస్ జగన్ కి మద్దతు ఇచ్చాడు, కృష్ణంరాజు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటూ ఇక్కడ తిట్టిపోస్తున్నారు మనల్ని కాబట్టి, మనం దానికి పడిపోవాలా అనేటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం.
దాన్ని కొన్ని వెబ్ సైట్స్ లో తెలుగుదేశం పార్టీ సాహో కి వ్యతిరేకము, సాహోను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతుందన్నటువంటి ప్రచారం వచ్చింది. దాని మీద కొంతమంది ప్రజల్లో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా కమ్యునిటీ పరమైనటువంటి ప్రజల్లో బాగా వ్యతిరేకం వచ్చేటువంటి పరిస్థితుందని గ్రహించినటువంటి లోకేశ్ ఒపెన్ గా ట్వీట్ చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అన్ని వెబ్ సైట్లని యూట్యూబ్ లని కాకుండా, ప్రధానంగా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వెబ్ సైట్స్ మీద దృష్టి సారిస్తూ దాన్ని ఎత్తి చూపెడుతూ ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు చేస్తూ వచ్చారు.
తద్వారా రెండు అంశాల్ని తేల్చి చెప్పారు.ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మేము కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వడం. రెండవది ఇలాంటి రాజకీయాలు మేం చేయబోమ్ అన్నటువంటి సంకేతం. పార్టీ తరఫున ఎవరూ చిన్న చిన్న కార్యకర్తలో, నాయకులో వేస్తే కరెక్టు కాదు. ఎందుకంటే ఇప్పటికే ఒకప్పుడు ఒక డ్యామేజ్ జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి సినిమాను దెబ్బకొట్టడం కోసం అప్పట్లో తెలుగు దేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి టార్గెట్ చేస్తూ కామెంట్ లు పెట్టడం,రెండో పక్కన సినిమా ధియేటర్లు కూడా పూర్తిగా ఇవ్వకపోవడం, అదే సందర్భంలో మిగతా సినిమాలకొచ్చేటప్పటికి ఎక్స్ ట్రా టైమ్ ఇచ్చి, దీనికి వచ్చేటప్పటికి కనీసం ఎక్స్ ట్రా ప్రదర్శనలకు కూడా అనుమతివ్వకపోడం, ఇవన్నీ కూడా అప్పుడు విమర్శల పాలైంది. అది చాలా డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఆ డ్యామేజీ ని జరగనీయకుండా ముందు జాగ్రత్తగా ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం అనేటువంటిది మంచి పరిణామం.