మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో టీజర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమాలో చిరంజీవి పడ్డ కష్టానికి ఆ వయసులో కూడా సినిమాపై చిరంజీవి చూపించిన డెడికేషన్ కి సలాం కొడుతున్నారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే సినిమా హాల్లో మెగాస్టార్ అభిమానులు కుర్చీలో కూర్చోవడం కష్టమని తెలుస్తోంది. అద్భుతంగా విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ అదిరిపోయే రీతిలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైరా టీజర్ సునామి సృష్టిస్తుంది. ఇప్పటికే పది మిలియన్ల డిజిటల్ న్యూస్ సంపాదించింది. ఇటువంటి నేపథ్యంలో సైరా టీజర్ పై మెగా అభిమానులతో పాటు చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. తాజాగా సైరా టీజర్ పై మంచు కుటుంబ సభ్యులు మంచు మనోజ్, మంచు లక్ష్మి స్పందించారు. 'మిత్రమా రాంచరణ్ నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదుర్స్. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూడలేకున్నా. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని మనోజ్ ట్వీట్ చేశాడు. 'టీజర్ లో మెగాస్టార్ ఎనర్జీ చూశాక నా మతి పోయింది. చిరంజీవి అంకుల్ ని మెగాస్టార్ అనేది అందుకే. ఇంతటి క్వాలిటీతో చిత్రాన్ని నిర్మించిన రాంచరణ్ కి అభినందనలు' అని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముంబై వేదికగా టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్మాత రామ్ చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: