సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాల రూపంలో రెండు బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో శ్రీమంతుడు సినిమాతో తనకు సూపర్ డూపర్ హిట్ ని అందించిన కొరటాల శివకు మరొక అవకాశం ఇచ్చిన మహేష్, ఆయనతో మలిసి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన భరత్ అనే నేనులో నటించడం జరిగింది. తొలిరోజు తొలిఆట నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఆ సినిమా, గత ఏడాది సూపర్ హిట్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇకపోతే ఇటీవల తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సిల్వర్ జూబిలీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఎంచుకుని అవకాశం ఇచ్చారు మహేష్. 

అయితే తొలిరోజు కాస్త నెగటివ్ గా టాక్ వచ్చినప్పటికీ, మెల్లగా ప్రేక్షక నాడి పట్టుకుని, ఆపై బంపర్ కలెక్షన్స్ సాధించి, ఏకంగా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ మూవీ గా నిలిచింది మహర్షి. ఇక ప్రస్తుతం తన 26వ సినిమా సినిమా సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న మహేష్, తదుపరి 27వ సినిమాకు మరొక్కసారి వంశీ పైడిపల్లికే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారని ఇటీవల కొద్దిరోజుల క్రితం వార్తలు రావడం జరిగింది. అయితే ఈ విషయమై నేడు ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే, కొద్దిరోజుల క్రితమే తమ కాంబినేషన్లో రాబోయే తదుపరి సినిమా కథను వంశీ ఆల్రెడీ మహేష్ బాబు కు వినిపించడం జరిగిందని, పక్కా కమర్షియల్ హంగులతో, అదరగొట్టే ఎంటర్టైన్మెంట్ తో సాగే ఆ సినిమాలో మహేష్ బాబు, 

తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక అద్బుతమైన క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాను టాలీవుడ్ లోని ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరొక సినిమా ఫిక్స్ అయినట్లు వస్తున్న వార్తలపై మహేష్ సన్నిహితులు కొందరు కూడా నిజమేనని అంటున్నారట. అయితే ఇందులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: