ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్ విషయంలో అనుసరిస్తున్న పద్ధతులు అతడి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ మీడియా వైపు చూపెడుతున్న శ్రద్ద ఆసక్తి తెలుగు మీడియా పై చూపెట్టకపోవడం. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు మహేష్ జూనియర్ చరణ్ బన్నీలు తమ సినిమాల విడుదల సమయంలో బుల్లితెర ప్రేక్షకుల కోసం ఇంటర్వ్యూలు ఇస్తారు కాని బుల్లితెర పై పాపులర్ అయిన గేమ్ షోలలో పాల్గొనరు. 

అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ పద్ధతి వేరు. బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ షారూఖ్ హృతిక్ రోషన్ రణవీర్ సింగ్ లు తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ అనేక గేమ్ షోలలో కూడ పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ‘నాచ్ బలాయి’ ‘సూపర్ సింగర్’ ‘కామెడీ నైట్స్’ ‘బిగ్ బాస్’ షోలలో పాల్గొంటూ బాలీవుడ్ టాప్ హీరోలు తమ లేటెస్ట్ సినిమాలను ధియేటర్లకు వచ్చి చూడమని అభ్యర్ధిస్తూ ఉంటారు. 

ఇప్పుడు బాలీవుడ్ లో ప్రభాస్ కి ‘సాహో’ విజయం అత్యంత కీలకం కావడంతో బాలీవుడ్ కల్చర్ ను కొనసాగిస్తూ ప్రభాస్ శ్రద్ధా కపూర్ తో కలిసి బాలీవుడ్ రవీనా టండన్ జడ్జిగా వ్యవహరిస్తున్న ‘నాచ్ బలాయ్’ షోకి అతిధిగా వచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు లీక్ అయ్యాయి. 

ఈ విషయంలోనే ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ పై కోపం వస్తోంది. తెలుగు బుల్లితెర పై ‘జబర్దస్త్’ ‘ఢి’ లాంటి షోలలో ప్రభాస్ కనిపిస్తే ‘సాహో’ కు ఇంకా ఎక్కువ మ్యానియా ఏర్పడుతుంది కదా అంటూ ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ‘సాహో’ ప్రమోషన్ విషయంలో జాతీయస్థాయి మీడియాకు ఇస్తున్నంత ప్రాధాన్యత తెలుగు మీడియాకు ఇవ్వడం లేదు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తన అభిమానుల అభిప్రాయాలను ప్రభాస్ పట్టించుకుంటాడా అన్నదే సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: