సాహో సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడింది. వరస ప్రమోషన్స్ తో యూనిట్ బిజీ అయ్యింది. సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వివిధ నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సాహో యూనిట్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దానికి తగ్గట్టుగానే ప్రచారం జరుగుతున్నది.
ఈనెల 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ప్రచారంలో భాగంగా శ్రద్దా కపూర్ ఇటీవలే మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడింది. సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇలా అడిగిన ప్రశ్నల్లో ఒకటి ఫస్ట్ డ్రింక్ అనుభవం. ఈ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది.
తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని చెప్పిన శ్రద్దా ఫస్ట్ అనుభవం గురించి కూడా చెప్పింది. చాలా కాలం క్రితం తన స్నేహితులతో కలిసి డ్రింక్ చేసింది. ఇంటికి ఆలస్యంగా రావడంతో తన తల్లి గుమ్మం వద్దనే కూర్చొని ఉందట. అయితే, అమ్మకు తాను డ్రింక్ చేశానని తెలియకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నం చేసింది. విచిత్రంగా మాట్లాడింది. బిగ్గరగా నవ్వింది. అవన్ని చేస్తున్నది శ్రద్ధా కాదు. ఆమెలో ఉన్న మరొకరు. కొత్తగా మందు కొట్టడంతో కిక్ ఎక్కువగా ఉండటంతో.. ఆ కిక్ తో విచిత్రంగా ప్రవర్తించింది.
చివరకు అమ్మకు దొరికిపోయినట్టు శ్రద్దా చెప్పింది. సరదాగా అనిపించినా ఈ మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని సినిమా ప్రారంభానికి ముందు వేస్తుంటారు. కానీ, సినిమాల్లో మందుకొట్టే సీన్లు ఉంటాయి. మందుకొట్టి సెలెబ్రిటీలు డ్రైవింగ్ చేస్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతుంటారు. గ్లామర్ ప్రపంచంలో వాళ్లకు ఇది మాములే. కానీ, అవేర్ నెస్ ఉండాలి కదా. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.