ఈటివి జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో షేకింగ్ శేషు ఒకరు. అమాయక చక్రవర్తిగా అతని కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. కొన్నాళ్లు చలాకి చంటి టీంలో వన్ ఆఫ్ ది కమెడియన్ గా ఉన్న శేషు ఆ తర్వాత షేకింగ్ శేషుగా సొంత టీం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ షో వల్ల అతనికి సినిమా ఛాన్సులు వచ్చాయి.      


సుప్రీం సినిమాలో శేషుకి మంచి పాత్ర దక్కింది. ఆ సినిమా హిట్ అవడం వల్ల అతనికి మంచి క్రేజ్ తెచ్చింది. ఆ సినిమా దర్శకుడు అనీల్ రావిపుడి శేషుకి ఛాన్స్ ఇవ్వడంలో ఇరకాటంలో పెట్టాడట. అప్పటికి జబర్దస్త్ లో ఫుల్ బిజీగా ఉన్న శేషు సుప్రీం సినిమా కోసం 40 రోజుల పాటు కాల్ షీట్ కావాలని అడిగారట.


జబర్దస్త్ కూడా చేస్తూ సినిమా చేస్తానని చెప్పగా అలా కుదరదని అన్నాడట అనీల్ రావిపుడి. అందుకే జబర్దస్త్ నిర్వాహకులతో మాట్లాడి ఆ సినిమా చేశానని అన్నాడు శేషు. సుప్రీం సినిమాతో తనకు మంచి గుర్తింపు రాగా ఆ తర్వాత కూడా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని అన్నాడు శేషు. అయితే సుప్రీం సినిమా తర్వాత అనీల్ రావిపుడి తన సినిమాల్లో అవకాశం ఇవ్వలేదని అన్నాడు శేషు.   


రాజా ది గ్రేట్ టైంలో అనీల్ రావిపుడిని తను కలిసి అవకాశం ఇవ్వమని అడిగానని.. సినిమాలో తనకు సూటయ్యే పాత్ర లేదని చెప్పాడని. అయితే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-2 సినిమాలో మాత్రం అంతేగా అంతేగా పాత్ర తనకు సూటయ్యేదని అనీల్ రావిపుడి అవకాశం ఇవ్వనందుకు చనిపోవాలని అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు శేషు. తను నటించడానికే పరిశ్రమలో ఉన్నానని తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తానని అంటున్నారు శేషు. మరి ఫ్యూచర్ లో అయినా అనీల్ రావిపుడి మాత్రమే కాదు మిగతా దర్శకులు అతనికి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: