కిచ్చా సుదీప్ ఈ పేరు తెలుగులో ఈ మద్య తెలిసినా.. కన్నడ నాట చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అప్పట్లో బాలీవుడ్ లో నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో నాని-సమంత నటించిన గ్రాఫిక్, వ్యూజువల్ వండర్ మూవీ ‘ఈగ’సినిమాలో విలన్ గా నటించారు కిచ్చా సుదీప్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కనిపించారు. తెలుగు లో కిచ్చా సుదీప్ కన్నడ మూవీస్ డబ్బింగ్ అవుతున్నాయి.
గతంలో కూడా చాలా మంది కన్నడ నటులు గెలుగు లో రాణించారు. ఒకప్పుడు చిరంజీవితో నువ్వా నేనా అంటూ పోటీ పడి నటించిన కన్నడ ప్రభాకర్ అక్కడి వారే..ఈ మద్య కేజీఎఫ్ మూవీతో తెలుగు వారి మనసు దోచుకున్న యష్ కన్నడ హీరో కావడం విశేషం. ఇక కిచ్చా సుదీప్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీలో నటిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ నిన్న ముంబాయిలో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి, రాంచరణ్ ఇతర టెక్నిషియన్లు, నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ..తాను ఈ మూవీలో 'అవుకు రాజు' పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు. సైరా మూవీ బడ్జెట్ ఎంతో.. అంతే విలువైన నటీనటులు ఈ సినిమా నటించారు. నా లాగే రాంచరణ్ కూడా ఓ నటుడు. కానీ తన తండ్రి మనసులో ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందని..ఆ కోరిక తెలుసుకొని తానే నిర్మాతగా మారి తండ్రి కోరిక తీర్చడం నిజంగా హర్షించదగ్గ విషయం అన్నారు.
ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు ఆ కుటుంబం ఆనందంతో వెలిగిపోతుందని అన్నారు. ప్రస్తుతం తాను సల్మాన్ ఖాన్ నటిస్తున్న దబాంగ్ 3 లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు. అన్ని భాషల్లో నటించడం నటుడిగా నాకు సంతోషాన్నిచ్చే విషయం అని సుదీప్ తెలిపాడు.