ఔటర్ రింగ్ రోడ్డు ఫై మొన్న తెల్ల వారుజామున ఓ కారు ప్రమాదానికి గురైన ఘటన ఇండస్ట్రీ లో కలకలం రేపింది. మొదట ఈ ప్రమాదం లో హీరో తరుణ్ పేరు గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. అయితే నాకు ఎలాంటి ప్రమాదం కాలేదు నేను ఇంట్లోనే ఉన్నాను అని తరుణ్ ప్రకటించాడు. ఇక పోలీసులు కారు నెంబర్ ఆధారంగా యంగ్ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైందని నిర్దారించారు. అయితే ఆ సమయం లోకారు లో రాజ్ తరుణ్ ఒక్కడే వున్నాడు. అదృష్టవ శాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఆ తరవాత సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రమాదం జరిగాక రాజ్ తరుణ్ పరిగెడుతున్న దృశ్యాలు కనబడ్డాయి. దాంతో మద్యం మత్తు లో నే రాజ్ తరుణ్ ఈ యాక్సిడెంట్ చేసుంటాడని వార్తలు వచ్చాయి. కానీ అసలు నిజం అది కాదు .
దీనిపై రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... నేను ఇంటి నుండి హైదరాబాద్ కు వస్తుండగా గత మూడు నెలలుగా అనేక ప్రమాదాలకు కారణమవుతున్న నార్సింగి ప్రాంతంలో నా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన వున్నా గోడను ఢీ కొట్టింది. దాంతో నా రెండు చెవులు బ్లాక్ అయిపోయాయి, చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. లక్కీ గా సీట్ బెల్ట్ పెట్టుకొని వున్నాను కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తరువాత వెంటనే కారు దిగి ఇంటికి వెళ్ళిపోయి ఇతరుల సహాయం తీసుకున్నాను. ఇది జరిగింది. ప్రస్తుతానికి నేను బాగానే వున్నాను. నా యోగ క్షేమాల గురించి అలోచించి నాకు ఫోన్ చేసిన అందరికి ధన్యవాదాలు. అతి త్వరలో మళ్ళీ నా సినిమాల షూటింగ్ లలో పాల్గొంటాను అని వెల్లడించాడు.