లేడీ సూపర్ స్టార్  నయనతార కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో వుంది. సౌత్ లో అటు స్టార్ హీరోల సరసన నటిస్తూ అలాగే అవకాశం  వచ్చినప్పుడల్లా  లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేస్తూ  ఫుల్ బిజీ అవుతుంది ఈ హీరోయిన్.   అంతేకాదు  సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఆమె నే కావడం విశేషం. ఇక్కడి వరకు బాగానే వుంది కానీ నయన్ మీద ఎప్పటినుండో ఓ కంప్లైన్ట్ వుంది అదేంటంటే సినిమా ప్రమోషన్స్ కు అస్సలు హాజరుకాదని.. అంత పెద్ద హీరోయిన్ తను నటించిన సినిమా ప్రమోషన్స్ కు వస్తే ఆ సినిమా కు ఇంకా ఎక్కువ హైప్ వస్తుంది కానీఈ విషయంలో నయన్ చాలా స్ట్రిక్ట్.  సినిమా కు సైన్ చేసే ముందు  ప్రమోషన్స్ కు రానని  నిర్మాతలకు  మొహం మీదనే చెప్పేస్తుంది. 



అయితే  ఇలా చేయడం  స్టార్ హీరోల సినిమాలకే కాదు ఒక్కప్పుడు ఇండస్ట్రీని  ఏలినా  సీనియర్ హీరోల విషయంలో కూడా ఇంతే. ఇక  ప్రస్తుతం తెలుగులో  మెగా స్టార్ చిరంజీవి సరసన  సైరా అనే చిత్రం లో నటించింది నయనతార. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసాక ప్రమోషన్స్ లో పాల్గొనాలని నిర్మాత  రామ్ చరణ్ , నయన్ ను  కోరాడట. అందుకు ఆమె ఓకే చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి.  అయితే మళ్ళీ  ఏమైందో ఏమో కానీ  నిన్న జరిగిన సైరా టీజర్ ఈవెంట్ కు  ఆమె హాజరుకాలేదు.



అయితే ప్రస్తుతం నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న  'దర్బార్'  చిత్రంలో నటిస్తుంది. మరి ఈ షూటింగ్ లో వుండి రాలేకపోయిందా లేక ఎప్పటి లాగే  ప్రమోషన్స్ కు దూరంగా ఉండలనుకుందో కానీ నయన్ , సైరా టీం ను మాత్రం  నిరుత్సాహపరించింది.  మరి  చరణ్ కనీసం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా నయనతార ను తీసుకొస్తాడో లేదో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: