అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా ఎంత పెద్ద కమర్షియల్ సక్సస్ ను అందుకుందో అందరికి తెలిసిందే. అప్పటి నుంచే ఈ సినిమాకు సీక్వెల్ ని నిర్మించాలని నాగార్జున అనుకున్నారు. అందుకే సోగ్గాడే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కే ఈ సీక్వెల్ బాధ్యతని కూడా అప్పగించాడు. అయితే మధ్యలో ఈ దర్శకుడుకి రవితేజతో ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన నేల టికెట్ ఫ్లాప్ అయింది. దాంతో కళ్యాణ్ కృష్ణ మళ్ళీ అన్నపూర్ణ కాంపౌండ్ కే వచ్చి చేరాడు. అప్పటి నుంచి సోగ్గాడే సీక్వెల్ బంగార్రాజు మీద స్క్రిప్ట్ కంప్లీట్ చేసి నాగ్ అండ్ నాగ చైతన్య కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఇన్నాళ్ళు ఈ ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు. నాగ్ మన్మధుడు-2 తో చైతూ వెంకీమామ తో చాలా బిజీ. అయితే ఈ మధ్యే ఫ్రీ అయ్యాడు. మన్మధుడు-2 డిజాస్టర్ అవడంతో వెంటనే ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని డిసైడయ్యాడు.  

అప్పుడు..ఇప్పుడు అంటు ఎప్పటి నుంచో వార్తల్లో వస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా నాగ్ సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీగా వుంది. అయితే ప్రస్తుతం సమస్య అంతా నాగచైతన్య డేట్ లు లేకనే. చైతన్య బయట సినిమాలతో బిజీగా వున్నాడు. వెంకీ మామ ఫినిష్ చేసి, శేఖర్ కమ్ముల సినిమా మీదకు వెళ్తాడు. అది పూర్తయితే తప్ప బంగార్రాజు మీదకు రావడానికి కుదిరేలా లేదు. వాస్తవానికి వెంకీ మామ తరువాత బంగార్రాజే చేయాలనుకున్నాడు చైతూ. కానీ డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు మృతి చెందడంతో, ఆయన తెరుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలని నాగ్ అనుకోవడంతో, చైతూ మరో సినిమాకు డేట్స్ సర్దుబాటు చేశాడు. 

అయితే వెంకీ మామ అనుకోకుండా కాస్త ఆలస్యమవుతోంది. అందువల్ల అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఇదిలావుంటే మన్మధుడు 2 సినిమా ఫెయిల్ కావడంతో, ఇప్పుడు నాగ్ కు మరో ఆప్షన్ ఏదీ రెడీగా లేదని తాజా సమాచారం. అందుకే 2020 సమ్మర్ టార్గెట్ గా బంగార్రాజు స్టార్ట్ చేయాలని అర్జంటుగా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ చేసి, వచ్చే సమ్మర్ లోగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హడావుడి అయిపోగానే బంగార్రాజు స్టార్ట్ చేస్తారని ఫ్రెష్ అప్‌డేట్. సినిమా మొదలు పెట్టి షూటింగ్ చేస్తూ ఉంటే ఆ తరువాత మెల్లగా చైతూ వచ్చి జాయిన్ అవుతాడట. అలానే బంగార్రాజు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: