అడివి శేష్ హీరోగా పివిపి సంస్థ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఎవరు. నటుడు మరియు రచయితైనా అడివి శేష్, నటిస్తూ, స్వయంగా కథను సమకూర్చిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించడం జరిగింది. ఆద్యంతం మంచి సస్పెన్స్ తో మరియు ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా, తొలి రోజు తొలి అట నుండి అత్యద్భుతమైన టాక్ ని సంపాదించింది. ఒక మర్డర్ మిస్టరీతో ప్రారంభమయ్యే స్టోరీని పలు రకాల మలుపులతో, 

ఊహించని మరియు ఊహకు కూడా అందని అద్భుతమైన ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాక, కొందరు సినిమా ప్రముఖులు సైతం, ఈ ఎవరు మూవీపై అద్భుతం, అమోఘం అంటూ ప్రసంశిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి వారం గడుస్తున్నప్పటికీ, దాదాపుగా చాలా సెంటర్స్ లో ఈ సినిమా ఇంకా అదరగొడుతూనే ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా ఏ, మరియు బి సెంటర్స్ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూలు కడుతున్నారని, అలానే యూత్ కూడా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నట్లు వారు చెప్తున్నారు. 

ఇక ఇప్పటికే పలు సెంటర్స్ లో ఈ సినిమాకు థియేటర్స్ పెంచినప్పటికీ కూడా, కలెక్షన్స్ లో ఏ మాత్రం తగ్గుదల లేదంటే, ఈ సినిమా ఎంతటి అత్యద్భుతమైన టాక్ ని సంపాదించిందో అర్ధం చేసుకోవచ్చని, ఈ సినిమా ఇదే హవాను కనుక మరికొద్దిరోజులు కొనసాగిస్తే, నిర్మాతలకు విరివిగా లాభాలు కురవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా విజయంతో తనపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని, త్వరలో తన నుండి రాబోయే మేజర్, గూఢచారి 2 సినిమాలు కూడా వారి అంచనాలు తప్పకుండా అందుకుంటాయని అంటున్నారు అడివి శేష్....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: