నిత్య మీనన్  అలా మొదలైంది సినిమాతో తెలుగు లో పరిచయం అయ్యింది. ఈ సినిమా విజయం తరువాత  నితిన్ తో  చేసిన రెండు సినిమలు కూడా విజయం సాధించాయి. మొదటి సినిమాకే నిత్య మీనన్ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.నిత్య మీనన్ నటన అద్భుతంగా చేస్తుంది, అందువల్ల నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తారు.మొదటి నుండి కొద్దిగా బొద్దుగున్న నిత్య ఇటీవల కాలంలో విపరీతంగా లావెక్కడం తో సోషల్ మీడియాలో ఆమె పై విపరితమైన ట్రోల్స్‌ మొదలయ్యాయి.

 సోమరితనం వల్లనే నీవు బరువు పెరిగావని  ట్రోల్స్‌ శ్రుతిమించాయి..  .బరువు పెరిగిపోవడంపై నిత్యా మీనన్ పెదవి విప్పారు. తన బాధను మీడియాతో పంచుకొన్నారు.నేను లావుగా మారిపోవడాన్ని టార్గెట్ చేసుకొని  సోషల్ మీడియాలో  చేసే  ట్రోల్స్ మనసికంగా నన్ను కుంగాదిస్తున్నాయి. మేమేదో కూర్చొని.. తింటు ఎంజాయ్ చేస్తామని అనుకొంటారు. కానీ మహిళలు లావు కావడానికి రకరకాల కారణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఏ పని చేయక, అతిగా  తినడం వల్లనే బరువు పెరిగానని  అనుకోవడం తప్పు అని నిత్య మీనన్ అన్నారు.

సాధారణంగా నాకే కాదు.. మహిళలందరికీ ఈ సమస్య ఉంటుంది. హార్మోన్ల లోపం వల్ల చాలా మంది లావు అవుతారు. కానీ కూర్చొని తినడం వల్ల లావెక్కరు  ఇలాంటి విషయంలో అందరిని ఎడ్యుకేట్ చేయాలి . నాకు తెలిసింది సినిమా ఒక్కటే. సినిమా కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అలాంటి సినిమాలో  ఉండలంటే ఫిట్ గా ఉండలని నాకు తెలిసి కూడా లావు ఎలా అవుతానని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. మిషన్ మంగళ్ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా విజయ వంతంగా ప్రదర్శింపబడుతుంది. ప్రస్తుతం మలయాళంలో కొలంబి అనే సినిమాలో నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: