సాధారణంగా సినీ పరిశ్రమలో మంచి పేరు ఉన్న నటుడి పేరు చెప్పుకొని ఎన్నో మోసాలకు పాల్పపడుతుంటారు కొంతమంది దళారు. సినీ పరిశ్రమలో తమకు పెద్ద దర్శకులు, నిర్మాతలు, హీరోలు పరిచయం ఉన్నారని, వారితో సంప్రదించి మీకు చిన్న ఛాన్సు ఇప్పిస్తామని ఎంతో మంది ఔత్సాహికులను మోసం చేస్తూ డబ్బులు గుంజుతుంటారు.  ఇక అమ్మాయిల విషయం అయితే మరీ దారుణం.  సినిమాల్లో నటించాలని ఎంతో ఆశతో వచ్చే యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా అనుభవించడమే కాదు వేశ్యా గృహాలకు అమ్మిన సంఘటనలు కూడా ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. 

ఆ అవమానం భరించలేక ఎంతో మంది యువతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.  ఆ మద్య శ్రీరెడ్డి ఇదే అంశంపై టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది. ఇక బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం కూడా మొదలైంది.  అయితే ఓ స్టార్ హీరో పేరు చెప్పుకొని దర్శకుడు ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..తమిళ స్టార్ హీరో విశాల్ కి తాను మంచి పరిచయం అని, త్వరలో తాము ఓ మూవీ తీయబోతున్నామని దర్శకుడు వడివుడైయాన్‌, తనను మోసం చేశారని నరేశ్ బోద్రా అనే వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. 

సినిమా తీయాలన్న కోరికతో ఉన్న బోద్రాను కలిసిన వడివుడైయాన్‌, తన వద్ద విశాల్‌ కాల్‌ షీట్స్‌ ఉన్నాయని చెప్పి, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించాడు.  అయితే విశాల్ లాంటి హీరోతో సినిమా అనగానే బోద్రా సంబరపడిపోయాడు..వెంటనే వడివుడైయాన్‌ కి రూ.47 లక్షలు ఇచ్చాడు. ఆ సమయంలో విశాల్ తో చేసుకున్న ఒప్పంద పత్రాలు చూపించడంతో బోద్రా బోల్తా పడ్డారు. 

డబ్బులిచ్చినా కూడా ఎంతకు సినిమా ప్రస్తావన తీసుకు రాకపోవడంతో ఆ పత్రాలు మరోసారి పరీక్షించగా అవి నకిలీవని తేలడంతో తాను దారుణంగా మోసపోయానని భావించిన బోద్రా తన డబ్బు వెనక్కి ఇవ్వాలని చెప్పాడు. కానీ, వడివుడైయాన్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నారట. దాంతో తనకు డబ్బులు  ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేశ్ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వడివుడైయాన్‌ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, నరేశ్‌బోద్రా ఎవరో తనకు తెలియదని వడివుడైయాన్ అంటుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: