కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అనీషా అనే అమ్మాయిని గతంలో హైదరాబాద్ నగరంలోని నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. దీంతో హీరో విశాల్ అనీషా నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో అధికారికంగానే వార్తలు వచ్చాయి. అనీషా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది. ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అతి తక్కువ సభ్యులు ఈ నిశ్చితార్థ వేడుక కి గతంలో వచ్చారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. అదే సమయంలో అక్టోబర్ 9వ తారీఖున వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.


ఎంతో ఘనంగా జరిగింది నిశ్చితార్థ వేడుక. ఇటువంటి నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో తాజాగా ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వీరిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయినట్లు సమాచారం. అనీషా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన నిశ్చితార్ధం ఫోటోలు, విశాల్ కి సంబంధించిన ఫోటోలు తరచూ పోస్ట్ చేసేది. విశాల్ కూడా ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేసేవారు. ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్ట్ లు పెట్టే అనీషా సడెన్ గా తన నిశ్చితార్ధపు ఫొటోలన్నీ తొలగించింది. కొసమెరుపు ఏమిటంటే ఇదే సమయంలో హీరో విశాల్ కూడా ఫోటో లన్నిటిని డిలీట్ చేయడం జరిగింది.


దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగినట్లు నిశ్చితార్థం క్యాన్సిల్ అయినట్లు తమిళ్ మీడియాలో వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు ఇటువంటి నేపథ్యంలో అనీషారెడ్డి మాత్రం పెళ్లి బ్రేక్అప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినపడుతోంది. కానీ మరోపక్క విశాల్ మాత్రం...పెళ్లి ఎలాగోలాగా జరిగేలా ఆమెను ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇంతకీ వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే అక్టోబర్ 9 వరకు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: