తెలుగు సినీ మాటల రచయిత,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలుపేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాసశర్మ.1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసి,నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్,మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా,జులాయి,అతడు,అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరు పొందాడు.త్రివిక్రం ఏపని చేసిన చాల పట్టుదలతో చేస్తాడు అనే పేరుంది.కాని ఈమధ్య ఓ మాజీ హీరోయిన్ కోసం కొత్తగా ఇల్లు కట్టించాడటా ఈ మాటల మాంత్రికుడు,ఇందుకోసం ఏకంగా 4కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ఓ ఊపు ఊపుతుంది ఇంతకీ త్రివిక్రమ్ నిర్మించిన ఆ ఇల్లు ఎవరికోసం అనే విషయాన్ని తెలుసుకుందాం.




గీతాఆర్ట్స్ బ్యానర్‌,హారికహాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం‘అల..వైకుంఠపురం' ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది.కీలక పాత్రలో సుశాంత్,నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.ఇక ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా అన్నపూర్ణస్టూడియోస్‌లో విలాసవంతమైన ఇల్లు సెట్ వేస్తున్నారట త్రివిక్రమ్.ఇందులోనే మేజర్ పార్ట్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది.ఇటీవలే భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ యూనిట్ చిన్నబ్రేక్ తీసుకొని మరోషెడ్యూల్ కోసం రెడీ అయిందట అందు కోసమే ఈ ఇల్లట.ఈ సెట్లో నటించవలసిన సన్నివేశాల్లో హీరోయిన్ పూజా హెగ్డే తల్లి దండ్రులుగా జయరాం,టబు నటిస్తున్నారని వారుండే ఆ విలాసవంతమైన ఇంటి పేరే వైకుంఠపురము అని ఆఇల్లే ఈ ఇల్లని తెలుస్తుంది.



ఇకపోతే బన్నీకెరీర్‌లో నా పేరు సూర్య డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమాకావడంతో అల్లుఅర్జున్,త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు.ఇటీవలే స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియోతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్.వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న ఈ సినిమా,అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమానట..

మరింత సమాచారం తెలుసుకోండి: