యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఎవరు  సినిమా  ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. మొదటి వారం లో ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా 9కోట్ల షేర్  వసూళ్లను రాబట్టి  సేఫ్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఇక  ఈనెల  30న రెబల్ స్టార్   ప్రభాస్ నటించిన సాహో విడుదలయ్యే వరుకు  ఈ సినిమా జోరు కొనసాగించనుంది. అయితే ఈ చిత్రం బయ్యర్లకు పెద్ద మొత్తంలో లాభాలు తీసుకోరకపోవచ్చు కానీ  చిత్ర నిర్మాత  పీవీపీ కి  మాత్రం కాసుల పంట పండిచనుంది. 


ఈచిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను ఆయన  9.50 కోట్లకు అమ్మారు.  అది కాగా శాటిలైట్ , డిజిటల్  హక్కుల రూపంలో  భారీగానే రాబట్టుకోనున్నాడు. ఇక ఈ చిత్రం అటు యూఎస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి  సూపర్ హిట్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ   హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకొనే అవకాశాలు ఉన్నాయి.  నూతన దర్శకుడు  వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. స్పానిష్ థ్రిల్లర్ 'ది ఇన్విజిబుల్ గెస్ట్'కు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. అయితే  తెలుగులో  చాలా మార్పులు చేశారు. 


ఇక  గత ఏడాది గూఢచారి చిత్రంతో హిట్ కొట్టిన అడివి శేష్ ఈ సారి ఎవరుతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.  ఈ రెండు సినిమాలు కూడా  ఆగస్టు నెలలోనే విడుదలకావడం విశేషం. ఇక  అడివి శేష్  ప్రస్తుతం  గూఢచారి కి సీక్వల్ గా తెరకెక్కనున్న  గూఢచారి 2 లో నటించడానికి రెడీ అవుతున్నాడు.  ఈ సినిమాతోపాటు శేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణం లో  మేజర్ అనే చిత్రంలో కూడా నటించనున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: