యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఎవరు సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. మొదటి వారం లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 9కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి సేఫ్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈనెల 30న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో విడుదలయ్యే వరుకు ఈ సినిమా జోరు కొనసాగించనుంది. అయితే ఈ చిత్రం బయ్యర్లకు పెద్ద మొత్తంలో లాభాలు తీసుకోరకపోవచ్చు కానీ చిత్ర నిర్మాత పీవీపీ కి మాత్రం కాసుల పంట పండిచనుంది.
ఈచిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను ఆయన 9.50 కోట్లకు అమ్మారు. అది కాగా శాటిలైట్ , డిజిటల్ హక్కుల రూపంలో భారీగానే రాబట్టుకోనున్నాడు. ఇక ఈ చిత్రం అటు యూఎస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకొనే అవకాశాలు ఉన్నాయి. నూతన దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. స్పానిష్ థ్రిల్లర్ 'ది ఇన్విజిబుల్ గెస్ట్'కు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. అయితే తెలుగులో చాలా మార్పులు చేశారు.
ఇక గత ఏడాది గూఢచారి చిత్రంతో హిట్ కొట్టిన అడివి శేష్ ఈ సారి ఎవరుతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు నెలలోనే విడుదలకావడం విశేషం. ఇక అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి కి సీక్వల్ గా తెరకెక్కనున్న గూఢచారి 2 లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతోపాటు శేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణం లో మేజర్ అనే చిత్రంలో కూడా నటించనున్నాడు.