సాయి ధరమ్ తేజ్ రీసెంట్‌గా చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి మంచి ఫాం లో ఉన్నాడు. వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటు మళ్ళీ ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో రాశీఖన్నా హీరోయిన్ గా, ప్రతిరోజూ పండుగే అనే సినిమా చేస్తున్నాడు మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా 60 శాతం పూర్తయిందని తాజా సమాచారం. ఇది కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయబోతుండగా, ప్రస్థానం వంటి విభిన్నమైన సినిమాతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న దేవాకట్టా డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఇక సుబ్బు అనే కొత్త దర్శకుడితో చేయబోయే సినిమాను నిర్మాత భోగవిల్లి ప్రసాద్ నిర్మించనున్నారు. 

ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేసినట్లు లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. నభా ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి, తన మీద వున్న ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వెర్షన్ జరుగుతన్న ఈ సినిమా నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ పండగే సినిమా అక్టోబర్ రెండవ వారం కి పూర్తయిపోతుందని చిత్ర బృందం తెలిపారట. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను నెలాఖరకు ఫినిష్ చేసి, విడుదలకు ప్లాన్ చేస్తారని సమాచారం.

ఇక నవంబర్ నుంచి కొత్త సినిమాతో సెట్స్ మీదకు తేజ్ వెళ్తాడని తెలుస్తోంది. మొత్తానికి నభా మెగా హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకుందంటే ఇక తన జాతకం మారినట్టేనని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే ప్రతి రోజూ పండుగే సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా? వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల అవుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వచ్చే ఏడాదిలో షెడ్యూలు చేస్తే, 2020లో సాయితేజ్ మూడు సినిమాలు అందించే అవకాశం వుంది.  ఇక నభా ప్రస్తుతం మాస్ మహా రాజా రవితేజ తో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఢిల్లీలో మొదలైన తాజా షెడ్యూ లో జాయిన్ అయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: