టాలెంటెడ్ హీరోయిన్  ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'.  సినిమా పై ఓ రేంజ్ నమ్మకం ఉంటే తప్ప.. ప్రివ్యూస్ వేయరు. అలాంటిది.  'కౌసల్య కృష్ణమూర్తి' మాత్రం ప్రివ్యూకి సిద్ధం అయిపొయింది. ఈ సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు  ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూ వేస్తోంది చిత్రబృందం. మొత్తానికి  ప్రివ్యూ వేస్తున్నారంటే  కౌసల్య  మీద బాగానే నమ్మకం ఉందన్నమాట.   ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు  నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌  కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండగా   క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకం పై భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.   క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో ఈ  చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు.  కాగా  ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు తమి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య మొదటిసారి డైరెక్ట్ గా చేస్తోన్న సినిమా  ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’.  కాగా లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివకార్తికేయన్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేయడం ఈ చిత్రానికి హైలైట్‌. 


ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం చాల ఎమోషనల్ గా ఉంటాయట. అలాగే క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ.  ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనే డ్రామా కూడా బాగా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.  ఇక ఈ సినిమా పట్ల చాలా ఇనెట్రస్టింగ్ గా ఉన్నానని తెలుగు సినిమాలో నటిస్తోన్నందుకు    ఐశ్వర్య రాజేష్ చాలా అనందం వ్యక్తపరుస్తోంది.  క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేయడం జరిగిందట. ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: