టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం అల వైకుంఠపురములో అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ తదిరతరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. 

సంక్రాంతి 2020 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల స్వతంత్ర దినోత్సవ కానుకగా హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బట్ల హౌస్ మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకువెళుతోంది. గుల్షన్ కుమార్ సమర్పణలో ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించారు. 

2008లో ఢిల్లీ లో జరిగిన బట్ల హౌస్ టెర్రరిస్ట్ అటాక్ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో, ఆ సినిమా యూనిట్ నేడు ముంబైలో ప్రత్యేకంగా ఒక పెద్ద పార్టీ ని అరెంజ్ చేయడం జరిగింది. ఆ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు సినీప్రముఖులు హాజరైన ఈ పార్టీలో, మన టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ హాజరవడం జరిగింది. ఇక నేడు ఆ పార్టీకి వచ్చిన అల్లు అర్జున్, దర్శకుడు నిఖిల్ అద్వానీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ తో పాటు బన్నీకి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో, ఆయనను ప్రత్యేకంగా ఈ పార్టీకి ఆహ్వానించినట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: