రాజ్ తరుణ్ యాక్సిడెంట్ విషయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిన్న నార్సింగి వద్ద ఒక కార్ యాక్సిడెంట్ కి గురైంది. చాలా ఆలస్యంగా అది హీరో రాజ్ తరుణ్ కారు అనే విషయం బయటకు వచ్చింది. వరుసగా వస్తున్న కథనాలతో ఎట్టకేలకి నిన్న సాయంత్రం ఒక లైవ్ సెల్ఫీతో తాను ఈ యాక్సిడెంట్ కి ఎంతగానో బాధపడుతున్నాని, ఒక వేళ సిట్ బెల్ట్ వేసుకోకపోయి ఉంటే తాను ప్రాణాలతో బతికి బయటపడేవాడిని కాదని తప్పకుండా అందరూ సీట్ బెల్ట్ వేసుకోవాలని ఆ వీడియోలో ఎంతో బాధతో వెళ్ళడించాడు. కానీ అసలు విషయం రాజ్ తరుణ్ కొత్త రూపం ఇప్పుడే బయటకు తెలిసింది. కార్తిక్ అనే ఒక ప్రత్యక్ష సాక్షి జరిగిన కథనంతా బయటపెట్టాడు. యాక్సిడెంట్ అయిన సమయంలో తాను బాల్కనీలో ఉండి చూస్తున్నానని వెళ్ళడించాడు.


రోడ్డుపై అక్స్మాత్తుగా చాలా వేగంగా ఒక కారు దూసుకు వచ్చిందని అది డివైడర్ ని గుద్దడం తాను కళ్లారా చూసానని చెప్పాడు. అదీ బ్రేక్ ఫేల్ అవ్వలేదని నేరుగా వచ్చి గుద్దిందేనని కార్తీక్ చెప్పారు. యాక్సిడెంట్ చూడగానే తాను షాక్ లో ఉన్నానని వెంటనే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి తాను వీడియో తీయడం మొదలు పెట్టానని చెప్పాడు. ఆ కార్లోంచి అనుకోకుండా ఒక వ్యక్తి బయటకు దిగి పరిగెత్తడం గమనించానని ప్రత్యక్ష సాక్షి కార్తిక్ తెలియజేశారు.వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి ఆ వ్యక్తిని వెంబడించడం మొదలుపెట్టాడు. అతడు అల్కాపురి వద్ద చిక్కాడు. అతని దగ్గరికి వెళ్లి చూడగా,అతడు హీరో రాజ్ తరుణ్ అని అర్ధమై అతనిని పిలిచాడు. కారుని యాక్సిడెంట్ చేసి ఎందుకు పరిగెత్తుతున్నారని కార్తీక్ ప్రశ్నించగా,ఊరికే దమ్ము కొట్టడానికి మాత్రమే ఇక్కడ ఉన్నానని తాను ఏ యాక్సిడెంట్ చేయలేదని సమాధానం చెప్పాడు. వెంటనే కార్తీక్ వద్ద ఉన్న విజువల్స్ ని చూపించగా షాక్ లో ఉన్న రాజ్ తరుణ్ కంగారు పడటం గమనించిన కార్తీక్ తన ఇంటివద్ద దింపేశాడు.


కార్తిక్ కి ఫోన్ నెంబర్ ఇచ్చిన రాజ్ తరుణ్ అతడికి రాజా రవీంద్ర గారు ఫోన్ చేస్తారని వెల్లడించారు. ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేశాడు. పొద్దున్నే ఫోన్ వచ్చిన వెంటనే. రాజా రవీంద్ర గారు రాజ్ తరుణ్ మద్యం సేవించిన ఉన్న మాట నిజమే, కాకపోతే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ కనుక బయటికి వస్తే అతని కెరియర్ మొత్తం నాసినమౌతుందని వాటిని బయట పెట్టవద్దని కార్తిక్ ని సముదాయించ్చాడు. దీనికి కార్తిక్ అంగీకరించక హీరోలే ఇలా మధ్యం సేవించి ఇలా యాక్సిడెంట్ లు చేయటం తప్పని అతను మండి పడ్డాడు. దీనికి రాజా రవీంద్ర గారూ తన మానేజర్ తో ఫోన్ చేపించి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పేలాగా బెరాలు మొదలు పెట్టారు.కార్తిక్ వ్యూహం ప్రకారం తాను ప్రతినిధుల ముందు డబ్బులు స్వీకరిస్తూ వారి అసల రూపాన్ని  బయట పెట్టాలనుకున్నాడు. ముందస్తు గానే సమాచారం బయటికి రావటంతో అతనికి ఒక లేడీ ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టింది. దీనికి ఆగ్రహించిన కార్తీక్ జరిగిన విషయాన్ని అంతా మీడియాకు ఆధారాలతో సహా బయట పెట్టి రాజ్ తరుణ్ అసలు రూపాన్ని అందరికి తెలియజేశారు. ఈ విషయం పై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: