టాలీవుడ్ లో ఈ మద్య భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొణిదెల రాంచరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మానియా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలపైనే చర్చలు నడుస్తున్నాయి. సైరా, సాహూ ఈ రెండు మూవీలు భారీ బడ్జెట్ తో నిర్మించబడ్డాయి..స్టార్ హీరోలు కొద్ది రోజుల వ్యవధిలోనే రిలీజ్ అవుతున్నాయి. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దాదాస్ నటించిన ‘సాహూ’ ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్, శ్రద్దాదాస్ బాలీవుడ్ లో ప్రమోషన్ బిజీలో పడ్డారు.  అయితే సైరా సినిమా ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. మొన్న సైరా టీజర్ ముంబాయిలో రిలీజ్ చేశారు. సైరా తెలుగు,కన్నడ,మళియాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి, రాంచరణ్, సుదీప్,విజయ్ సేతు పతి తో పాటు తమన్నా హాజరయ్యారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన నయన్ కనపడలేదు. అయితే ప్రస్తుతం తాను షూటింగ్ బిజీలో ఉండటం వల్లనే రాలేదని ఆమె నుంచి సమాచారం.  వాస్తవానికి  సైరా సినిమాకు సైన్ చేసినప్పుడు నయన్ ప్రమోషన్ లో పాల్గొంటానని చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. 

అయితే ఫైనల్ బేబీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి షూటింగ్స్ లో బిజీగా ఉన్నానంటూ తప్పించుకుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన తమన్నా మాత్రం అడిగిన వెంటనే సంతోషంతో వెళ్లిందట. కానీ నయన్ సినిమాలో కథానాయిక పాత్ర. తప్పకుండా ప్రెస్ మీట్ లో ఉండాల్సిన పరిస్థితి..కానీ లేదు. అంటే నయన్ నిజంగా షూటింగ్ బిజీలో ఉందా లేదా మెగాస్టార్ హ్యాండిచ్చిందా? అని సినీ వర్గాల్లో గుస గుస. అయితే ఇలాంటి రూమర్లు పుడుతూనే ఉంటాయి..కానీ ఈ విషయంపై నిర్మాత, దర్శకులు ఎలాంటి కామెంట్ మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: