గత వారం ఒకేరోజు ఎవరు, రణరంగం సినిమాలు రెండు భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఆశ్చర్యంగా ఈ రెండు సినిమాలకు వసూళ్లు కూడా ఒకేలా వచ్చాయి. కానీ రిజల్ట్ మాత్రం ఒకేలాలేదు. క్రిటిక్స్, రివ్యూస్ పరంగా కూడా ఈ రెండు ఒకేలా లేకపోవడం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయింది. 21 వ తేదీతో వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది ఎవరు సినిమా. అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు మొన్నటి వసూళ్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అటుఇటుగా 9 కోట్ల 50 లక్షలు చేశారు. కాబట్టి ఈ సినిమా దాదాపు బ్రేక్-ఈవెన్ అయినట్టేనని సమాచారం.

రణరంగం సినిమా కూడా మొన్నటితో 7 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు కూడా మొదటి వారం 9 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ సినిమా మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఈ సినిమా 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే మరో 8 కోట్లు కావాలి. మరో వారంరోజుల్లో సాహో వచ్చేస్తోంది...కాబట్టి ఉన్న ఈ వారంలో ఈ సినిమాకి 8 కోట్లు రావడం దాదాపు అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అటు క్రిటిక్స్ పరంగా కూడా ఈ రెండు సినిమాల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. విడుదలైన మొదటిరోజే ఎవరు సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆ రేటింగ్స్, రివ్యూస్ కు తగ్గట్టే సినిమా రిజల్ట్ బాగా ఉంది. రణరంగం సినిమాకు మొదటిరోజే నెగెటివ్ మార్కులు పడ్డాయి. దానికి తగ్గట్టుగానే సినిమా వీక్ డేస్ లో చతికిలపడింది. ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల్లో ఉన్నంతలో ఎవరు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియోటర్స్ లో సందడి చేస్తోంది. ఇక శర్వానంద్ రణరంగం దాదాపు ఢీలా పడినట్టే అనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: