తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా ప్రస్తుతం కెవి ఆనంద్ దర్శకత్వంలో బందోబస్త్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ్ లో కాప్పన్ పేరుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాను తెలుగులో బందోబస్త్ పేరుతో డబ్ చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ప్రధాన మంత్రిగా ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా, సూర్య ఇందులో ఎన్ఎస్జి కమాండర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఎన్జీకే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, ఈ బందోబస్త్ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందిస్తుందని సూర్య భావిస్తున్నారట.  

ఇక ప్రస్తుతం ఈ సినిమాతోపాటు సుధా కొంగర దర్శకత్వంలో సురరై పోట్రు సినిమాలో నటిస్తున్న సూర్య, వీటి తరువాత చేయబోయే సినిమాను కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. దర్శకుడు శివ తెరకెక్కించనున్న ఈ సినిమాలో సూర్య ఒక పక్కా మాస్ క్యారెక్టర్లో నటించనున్నారట. గతంలో అజిత్ హీరోగా వేదలమ్, వీరం, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన శివ, ఎట్టకేలకు తొలిసారి సూర్యతో తీస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయమై నేడు కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, నిజానికి గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేని సూర్య, ప్రస్తుతం చేస్తున్న కాప్పన్ మరియు సురరై పోట్రు రెండూ కూడా గతంలో తాను చేసిన సినిమాల మాదిరి ప్రయోగాత్మకమైన సినిమాలే కావడంతో, అంతటితో ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఇకపై మంచి కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఆయన నిర్ణయించినట్లు చెప్తున్నారు. 

అందువలనే త్వరలో శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పక్కా మాస్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్తున్నారు. అటువంటి సినిమా అయితే తప్పకుండా అందరిని ఆకట్టుకుని విజయవంతం అవుతుందని ఆయన భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, శివ దర్శకత్వంలో సూర్య నటిస్తే చూడాలి అని మాత్రం, ఆయన అభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా సూర్య, శివ కాంబో సినిమా మంచి మాస్ ఎంటర్టైనర్ గా రూపొంది సూపర్ హిట్ అయితే, సూర్య ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: