ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో, ఈనెల 30వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తొలిసినిమా రన్ రాజా రన్ తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ సంస్థ అధినేతలు ప్రమోద్, వంశి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకువెళ్లాయి. 

తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ షోలు కూడా ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేశారట సినిమా నిర్మాతలు. ఇప్పటికే ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా సాహో పై భారీ స్థాయిలో అంచనాలు ఉండడంతొ ప్రీమియర్ షో ల ద్వారా భారీ మొత్తాన్ని రాబట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారట. అలానే అక్కడ తమ సినిమాను అవకాశం ఉన్నన్ని ఎక్కువ థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ సినిమాకు సంబంధించి పబ్లిసిటీ మరియు ప్రమోషన్స్ కూడా విరివిగా చేపట్టారట. ఇక ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం, సాహో సినిమా ప్రీమియర్ షోలతో వసూళ్ల పరంగా బాహుబలి మొదటి భాగాన్ని సునాయాసంగా అధిగమిస్తుందని, 

అయితే కొన్ని ప్రాంతాల్లో థియేటర్స్ కనుక పూర్తి స్థాయిలో లభ్యమైతే, బాహుబలి 2 ని కూడా మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు చెప్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల అనంతరం రాబోతున్న సినిమా కావడంతో, సాహో పై ప్రేక్షకుల్లో అంచనాలు ఊహకందని స్థాయిలోనే ఉన్నాయి. మరి ఏ మాత్రం ఆ అంచనాలు అందుకని సాహో సక్సెస్ ని సాధించినా, ఆ సినిమా సాధించే కలెక్షన్ల సునామీకి అడ్డుకట్ట వేయడం కష్టమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: