మెగా హీరో అల్లు అర్జున్ ఎన్నడూ లేని విధంగా నాపేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం కొత్త సినిమాలతో సదడి చేసే అల్లు అర్జున ఈసారి రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ఏ ఫంక్షన్లో ఈ ప్రస్తావన తీసుకు వచ్చినా త్వరలో మీ ముందు ఉంటా అంటూ అభిమానులను ఉత్తేజ పరుస్తూ వచ్చారు. అయితే నా పేరు సూర్య డిజాస్టర్ కావడంతో తన తదుపరి సినిమా సూపర్ హిట్ కావాలనే ధ్యేంగా ఉన్నారు. అందుకే ఆయన సరైన దర్శకుడి కోసం ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి కథ చెప్పడంతో ఆయనకు ఓకే చేశారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో 'అలవైకుంఠపురములో' రూపొందుతుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత 'ఐకాన్' షూటింగ్ మొదలుకానుంది. నిర్మాత దిల్ రాజు.. అలియా భట్ తో సంప్రదింపులు జరిపారు. మొదట ఈ మూవీలో బాలీవుడ్ బబ్లీ బ్యూటీ ఆలియా భట్ అనుకున్నారు..కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అదే సమయంలో అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం గీతాఆర్ట్స్ సంస్థ దిశాపటానీని సంప్రదించింది.
అఖిల్ తో సినిమా చేయడానికి దిశా ఆలోచనలో పడింది. ఎందుకంటే ఈ బ్యూటీ క్రేజ్ కి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. అసలే ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్ సినిమా టీమ్ వెనక్కి తగ్గింది. అయితే దిల్ రాజు మాత్రం తన 'ఐకాన్' సినిమా కోసం దిశాని సంప్రదించి ఆమె అడిగినంత మొత్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని సెట్ చేశారు. గతంలో పూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నగించింది ఈ హాట్ బ్యూటీ.