యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ యాక్షన్ ఘట్టాలతో భారీ హంగులతో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్నారు.


ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై తారాస్థాయి అంచనాలు ఏర్పరచగా లేటెస్ట్ గా సాహో నుండి వచ్చిన ఓ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. భారీ యాక్షన్ సీన్ లో యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రభాస్ చుట్టూ వందమది దాకా విలన్ మూక ఉన్నట్టుగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే సాహో మాస్ ఆడియెన్స్ కు కన్నుల పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు.


బాహుబలిలో ప్రభాస్ కాలకేయుడిని ఎలా మట్టిపెట్టాడో చూశాం.. అలానే సాహోలో ఒక కాలకేయుడు కాదు 100 మంది కాలకేయులు ఎదురు వస్తే ప్రభాస్ ఎలా వారితో ఫైట్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇప్పటివరకు సాహో నుండి స్టైలిష్, రొమాంటిక్ యాంగిల్స్ పోస్టర్స్ రూపంలో చూపించగా ఇప్పుడు యాక్షన్ సీన్స్ పై ఆసక్తి పెంచుతున్నారు.


బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ చేసిన ఈ సాహోపై బాలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి సంచలనాలను రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. సాహో సినిమాకి భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మొదటి రోజే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు తెచ్చేలా నిర్మాతలు స్కెచ్ వేశారు. బజ్ కూడా భారీగా ఉండటంతో మరోసారి ప్రభాస్ తన సత్తా చాటడం ఖాయమని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: