తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.  ఇప్పటికే నలుగు కంటిస్టెంట్లు ఎలిమినేషన్ అయ్యారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఎరు రెమ్యూనరేషన్ గురించి ఇంత హడావుడి చేస్తున్నారని అనుకుంటున్నారా? అబ్బే తెలుగు లో బిగ్ బాస్ కాదు..తమిళంలో కమల్ హాసన్ హూస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 3.  ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది బిగ్ బాస్. 

ప్రస్తుతం తమిళంలో వస్తున్న బిగ్ బాస్ 3 లో ఈ మద్య తమిళ కమెడియన్ మధుమిత ఆత్మహత్యా యత్నం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆమెని ఇంటినుండి బయటకి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ తమను బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తాజాగా ఈ విషయంపై మధుమిత మాట్లాడుతూ.. నేను తమిళ చిత్ర పరివ్రలో  పదేళ్లుగా ఉన్నాను. ఇది వరకు నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నా గురించి సినీ సెలబ్రెటీలందరికీ తెలిసిందే..నా మంచి తనం గురించి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.  నాకు ఇవ్వాల్సిన పారితోషికాన్నే విజయ్‌ టీవీ నిర్వాహకులను అడిగాను. వాళ్లు బిల్లు పంపమని అడిగారు. నేను కూడా పంపించా... డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. 

తమ మధ్య ఎలాంటి సమస్య లేదని.. కానీ సడెన్ గా విజయ్ టీవీ నిర్వాహకులు తనపై పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారో అర్ధం కావడం లేదని వెల్లడించింది.  అయితే ఈ విషయంపై విజయ్ టీవీ నిర్వాహకులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు.  ఈ విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానని మధుమిత అంటుంది. బిగ్ బాస్ ఇంట్లో కొన్ని ఫుటేజ్ లు మాత్రమే చూపించారని..అసలైనవి చూపించలేదని, బిగ్ బాస్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఇతర విషయాలను  మాట్లాడలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: