ప్రస్తుతం సమంత హైదరాబాద్ లో కంటే చెన్నైలో ఎక్కువగా ఉంటోంది. ఒక వెబ్ సిరీస్ ను తెలుగు తమిళ భాషలలో నిర్మించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ తన సినిమాలకు సంబంధించి ఆమె ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అనేక మంది దర్శకులు చెపుతున్న కథలు సమంత వింటున్నప్పటికీ తాను మరో మూడు సినిమాలకు మించి నటించను అంటూ తనకు కథలు చెపుతున్న దర్శకులకు సమంత లీకులు ఇస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఆమె ఒప్పుకునే మూవీ ప్రాజెక్ట్స్ అన్నీ 2020 చివరికి పూర్తి అయ్యేలా ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. దీనికి కారణం 2021 నుండి ఆమె దృష్టి అంతా చైతూతో కనబోయే పిల్లల పైనే దృష్టి పెట్టి తాను ఇద్దరి పిల్లలలను కంటాను అంటూ ఇప్పటికే చైతన్యకు సమంత తన అభిప్రాయాన్ని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

దీనితో సమంత ఏసినిమాలు ఒప్పుకున్నా ఆమూవీల వర్క్ అంతా వచ్చే ఏడాది చివరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకుని ఆ తరువాత కనీసం 4 సంవత్సరాలు నటనకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు పుట్టబోయే పిల్లల విషయం అదేవిధంగా తాను తన సొంత బ్యానర్ పై తీయబోతున్న వెబ్ సిరీస్ చిన్న సినిమాల విషయల పై సమంత ఈ టైమ్ లో దృష్టి పెడుతుందని అంటున్నారు. 

ఈ విషయాలు అన్నీ చైతన్యకు కూడ బాగా క్లారిటీగా తెలిసిన విషయంలో కొంతమంది దర్శక నిర్మాతలు మళ్ళీ చైతన్య సమంతల మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ మరొక సినిమాను తీయాలని ప్రయత్నిస్తున్నా చైతన్య ఈ విషయానికి సంబంధించిన కథలను వనడానికి కూడ ఆశక్తి కనపరచడం లేదు అని టాక్. దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో సమంత ఫ్యామిలీకి ఇచ్చిన డెడ్ లైన్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: