తమిళ స్టార్ హీరో సూర్య, విశ్వాసం ఫేమ్ శివ డైరెక్షన్ ల్లో తన 39వ చిత్రంలో నటించనున్నాడు.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్  పతాకం ఫై కేఈ జ్ఙానవేల్ రాజా నిర్మించనున్నాడు.  ఈ చిత్రంలో  సూర్య కు జోడిగా కాజల్ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళా అదే నిజమైతే సూర్య తో కాజల్ కి ఇది రెండో సినిమా అవుతుంది. ఇంతకుముందు వీరిద్దరూ  కలిసి బ్రదర్స్ లో నటించారు.  కాగా మొదటి సారి సూర్య -శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ సినిమా ఫై మంచి క్రేజ్ నెలకొంది. 





ఇక సూర్య ప్రస్తుతం  'గురు' ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో  'సురరై పోట్రు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో  సూర్య కు జోడిగా అపర్ణ బాలమురళి  నటిస్తుండగా  ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.  జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలకానుంది. ఇక ఇటీవల  'ఎన్జీకే'  తో ప్రేక్షకులముందుకు వచ్చి  సూర్య భారీ పరాజయాన్ని చవిచూశాడు. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈచిత్రం తెలుగులో అయితే దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇక ఇప్పుడు 'బందోబస్త్' ఫై సూర్య ఆశలు పెటుకున్నాడు.  రంగం ఫేమ్  కేవీ ఆనంద్ డైరెక్షన్ లో  హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య  హీరోగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ  ముఖ్య పాత్రల్లో నటించారు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 20న  విడుదలకానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: