స్టార్ హీరోలు కొత్త డైరక్టర్లతో సినిమా చేద్దాం అనుకున్నా, అది అంత ఈజీగా వర్కౌట్ అయ్యేపనికాదు. ఇది చాలామంది విషయంలో జరుగుతుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో కొత్త డైరెక్టర్ కి చాన్సివ్వడం అంటే ఒక పెద్ద ఎక్స్‌పరిమెంట్ చేసినట్టే. అందుకే ఎంత ట్రై చేసిన కొత్త డైరెక్టర్లు కొత్త హీరోలతోనో..ఒక మోస్తారు పేరున్న హీరోలతోనో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటారు. ఇక స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ మధ్య ఇలాగే ఓ సినిమాను కొత్త డైరక్టర్ తో చేయాలనుకున్నాడు. ఇదంతా త్రివిక్రమ్ సినిమా ఓకె చేయక ముందు జరిగిన సంగతి. అప్పట్లో ఈ విషయం లో ఫిల్మ్ నగర్ లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అంతలో త్రివిక్రమ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఫైనల్ అయి సెట్స్ మీద ఉంది.

దాంతో ఆ కొత్త డైరక్టర్ తన స్క్రిప్ట్ తో మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు. స్క్రిప్ట్ బాగుంది కదా అని నిర్మాత భోగవిల్లి ప్రసాద్ దగ్గరకు తీసుకెళ్ళారు. హీరో సాయిధరమ్ తేజ్ తో ఆ ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఆ డైరక్టర్ పేరే సుబ్బు. ఈ డైరెక్టర్ గతంలో విరించి వర్మ తదితరుల దగ్గర అసోసియోట్ గా పనిచేసారు. ఇక సాయితేజ్ రీసెంట్‌గా చిత్రలహరి సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చేశాడు.

అంతేకాదు, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు డైలాగ్ వెర్షన్ కూడా ఈ సుబ్బు నే రాస్తున్నాడని తెలుస్తోంది. నభానటేష్-సాయితేజ్ కాంబినేషన్ లో నవంబర్ తరువాత నుంచి ఈ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక నభా రీసెంట్‌గా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. మొత్తానికి నభా కి పూరి ఇచ్చిన ఇస్మార్ట్ హిట్ తర్వాత కెరీర్ బాగానే ఊపందుకుంది. అంతేకాదు రెమ్యునిరేషన్ కూడా దాదాపు 40 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని తాజా సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: